మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం - సిడిపిఓ వీరలక్ష్మి
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం - సిడిపిఓ వీరలక్ష్మి
గొల్లపల్లి ఫిబ్రవరి 12 ప్రజా మంటలు
గొల్లపల్లి మండలము లోని చందోలి జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో అనే కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చందోలి జడ్పీహెచ్ఎస్ పాఠశాల పిల్లలకు మానసిక ఆరోగ్యము ప్రేరణ అనే అంశంపై అవగాహన కార్యక్రమానికి మల్యాల సిడిపిఓ వీరలక్మి మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందు ఉంటూ భారత దేశ ప్రగతికి రథచక్రాలుగా మారాలని వారి అభివృద్ధి తో పాటు సమాజ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.
అదేవిధంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కో ఆర్డినేటర్ శ్రావణ్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పిల్లలు అనేక రకాల ఆకర్షణలకి ముఖ్యంగా మొబైల్,ఫోన్,డ్రగ్స్, మరియు ప్రేమ అనే అంశాలకు ఆకర్షితులు కావద్దని, అదే వారి బంగారు భవిష్యత్తుకు ఆటంకం కలిగించుకుంటున్నారని వాటి నుంచి బయటపడి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని ఎన్ని రకాల అవంతరాలు వచ్చినా ఆకర్షణలు వచ్చినా లోను కాకుండా మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు అదేవిధంగా మహిళ సాధికారత నుండి స్వప్న మాట్లాడుతూ నేటి సమాజంలో ఇప్పటి కి వయసు నిండకుండా వివాహాలు చేస్తున్నారని బాల్య వివాహాల రూపంలో బాలికల యొక్క హక్కులకు భంగం కలుగుతుందని వారు 21 సంవత్సరాల వచ్చేంత వరకి లేదా ఒక వృత్తిలో పడేంత వరకి వివాహం చేసుకోరాదని సూచించారు. అలాగే తేజస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖి కేంద్రం కేసు వర్కర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు ఒక లక్ష ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా వారు ముందుకు వెళ్లాలని అలాగే సఖి అందించే సేవలు కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి , ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
