బాలికలు అన్ని రంగాలలో రాణించాలి. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
జగిత్యాల ఫిబ్రవరి 8(ప్రజా మంటలు )
బాలికలు అన్ని రంగాలలో రాణించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమ దశాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల క్రీడా పోటీలను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. స్వామి వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుతోపాటు ఆట, పాటలలో కూడా రాణించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం లభించడమే కాకుండా క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన బాలికలకు విద్య, ఉద్యోగాలలో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. దేశానికి క్రీడారంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించిపెట్టిన పీవీ సింధు, సైనా నెహ్వాల్, నికాత్ జరీనా లాంటి మహిళ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఆడపిల్లలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేష్, జిల్లా విద్యాధికారి రాములు, తాసిల్దార్ రామ్మోహన్ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
