బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా - అడ్లూరి
బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా
- ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 08: ఎస్సి వర్గీకరణ, బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో తాను ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజక వర్గ కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎస్సీ ల ముపై ఏళ్ల ఆకాంక్ష వర్గీకరణ అసెంబ్లిలో ఆమోదించిన ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం దళిత వర్గానికి చెందిన వాడిగా చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని, తన నాయకుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అసెంబ్లీలో ఆమోదించారన్నారు.ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని కమిటీని నియమించి కమిటీ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించి కులగణన చేయడం జరిగిందన్నారు
మాజీ జస్టిస్ ఏకసభ్య సభ్య కమిటీ చైర్మన్ గా షబీబ్ ముక్తాల్ ను నియమించి వారి నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చించడం జరిగిందని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ బీసీ కుల గలన చేయలేదని, అది తమ ప్రభుత్వమే చేసిందని, ఎస్సీ వర్గీకరణ బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో తాను ఉండడం తన అదృష్టంగా భావిస్తున్న ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా అన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని అణిచివేసిందని, అంతేకాకుండా మందకృష్ణ మాదిగను జైలు కూడా పంపించిన సందర్భం ఉందన్నారు. నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
.
More News...
<%- node_title %>
<%- node_title %>
రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన
