గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్
సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి.
మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ ఐ కిరణ్ సిబ్బందితో శాంతినగర్ లోని ఒక ఇంటిలో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్,సునీల్ కుమార్, సంతోష్ కుమార్,చోటు కుమార్ లను పట్టుకొని విచారించమని అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... గత కొన్ని నెలల క్రితం మెట్ పల్లి పట్టణానికి బీహార్ నుండి నలుగురు వ్యక్తులు వచ్చి హమాలి పని చేసుకుంటూ శాంతినగర్ లో నివాసముంటూ, ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొని వచ్చి వాళ్లు సేవించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన మెట్ పల్లి, మల్లాపూర్ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నారని అన్నారు.
నిందితుల యజమానికి చెందిన అశోక్ లేలాండ్ వాహనంలో తిరుగుతూ, నిందితులు అమ్ముతున్నారని అన్నారు. మధ్యాహ్న సమయంలో కాలనీవాసులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి నిందుతులను పట్టుకొని 450 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, అశోక్ లేలాండ్ వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చిన కాలనీవాసులకు పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.
