కుల గణనలో కుల సంఘాలు యాక్టివ్ గా పనిచేయాలి
బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 25 (ప్రజామంటలు) :
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన ప్రక్రియను కుల సంఘాలు సవాలుగా స్వీకరించి, యాక్టివ్ గా పనిచేస్తూ, వందశాతం కులగణన సాధించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ కోరారు. ఆయన మంగళవారం సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ ఆదం సంతోష్ కుమార్ తో కలసి సీతాఫల్మండి జె.ఎం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ఎన్నికలు జరిగే సందర్బాల్లో కులాల రిజర్వేషన్ అంశం తెరపైకి వస్తుందని, అప్పుడు కోర్టులు ప్రభుత్వాలను అసలు ఆయా కులాల జనాభా ఎంత అని ప్రశ్నిస్తాయని అన్నారు.
అప్పుడు ప్రభుత్వాల వద్ద కుల గణనపై సృష్టత లేనట్లయితే ఎన్నికల నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రూరల్ లో 22 శాతం, అర్బన్ లో 27 శాతం రిజర్వేషన్లను బీసీ లకు ఖరారు చేస్తే వారు దాదాపు 44 శాతం సీట్లు గెలిచారన్నారు. అదే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తే దాదాపు 65 నుంచి 70 శాతం వరకు గెలిచే అవకాశం ఉండేదన్నారు.
కులగణన అనేది కేవలం ఎన్నికల అంశం ఒక్కటే కాదని, ఆర్థిక, సామాజిక, స్థితిగతులకు కూడ ఈ కులగణన సర్వే ఎంతో ఉపకరిస్తుందన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఓసీలకు ఇది ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ఎవరి మద్య మనస్పర్థలు రాకుండా కులసంఘాలు ఐక్యత ప్రదర్శించాలని కోరారు. 50 శాతం రిజర్వేషన్ మించి రావాలంటే రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టవలసి ఉంటుందన్నారు. ఒక వేళ ఇది జరిగే అవకాశం ఉన్నప్పుడు మన కుల గణన డేటా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది, నాయకులు ఆదం సృజన్, డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, షకీల్, వహీద్, చక్రధర్, సూర్య ప్రకాశ్, కల్పన, రాజేందర్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
