విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభం ఎస్ ఈ సాలియా నాయక్
జగిత్యాల ఫిబ్రవరి 10( ప్రజా మంటలు)
వినియోగదారులకు ఉత్తమమైన సేవలు అందించడం లో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ గారు స్పష్టం చేసారు . వినియోగదారునికి కొత్త సర్వీసుల మంజూరులో ఏదైనా కారణం చేత దరఖాస్తును తిరస్కరించకుండా వినియోగదారుడు తగు విధంగా స్పందించడానికి మరొక అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు .
వివిధ కారణాల వలన డిపార్ట్మెంట్ రూల్ కు లోబడి కొత్త సర్వీసుల మంజూరు ఆలస్యం కాకుండా ఉండేందుకు వినియోగదారునికి దరఖాస్తు చేసుకున్న దానిపై మెసేజ్ రూపకంగా ప్రతి ఒక్క దశలో వెళ్తుంది .
ఉదాహరణకు : కొత్త సర్వీస్ మంజూరు నిమిత్తం అవసరమగు పత్రాల కొరకు వినియోగదారునికి వచ్చిన యస్ యంఎస్ ద్వారా తెలుసుకొని నిర్దిష్ట సమయంలో సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది . తద్వారా వినియోగదారునికి అట్టి సర్వీస్ పై మరింత ఆవగాహన ఏర్పడి వెంటనే సంబంధిత పత్రాలు జమ చేయడం వలన సర్వీసులు త్వరిత గతిన మంజూరు చేయడం జరుగుతుంది .
దీని వలన టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ పై వినియోగదారునికి పారదర్శకత , జవాబుదారీతనం, సంతృప్తి, నమ్మకం కలుగుతుందని చెప్పారు .
అలాగే వినియోగదారుడు తన అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి కొత్తగా ట్రాకింగ్ చేసే వెసులుబాటు కల్పించాం. దీని ద్వారా వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నంబర్ తో టీజీ ఎన్పీడీసీఎల్ వెబ్సైట్ నుండి లేదా టీజీ ఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా వివిధ దశల్లో ఉన్న అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి ఈ ట్రాకింగ్ సిస్టమ్ ను రూపొందించడం జరిగిందని చెప్పారు .
పై వాటిలో వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912 కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.
వినియోగదారునికి మరింత మెరుగైన , నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు వేగవంతంగా , సులభతరంగా చేస్తున్నామని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
