టిపియుఎస్ ఆధ్వర్యంలో డీఏలు, పిఆర్సిలు ప్రకటించాలని భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ధర్మపురి అక్టోబర్ 22 (ప్రజా మంటలు) :
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టిపియుఎస్ ఆధ్వర్యంలో పాఠశాలలో ఉపాధ్యాయులందరూ భోజనం విరామనంతరం డీఏలు, పిఆర్సి ప్రకటించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ధర్మపురి మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుమ్మె నాలలో ఉపాధ్యాయులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్, ఉపాధ్యాయులు వెంకటరమణ ,రాజేష్, అంజాద్ హుస్సేన్, నారాయణ ,కాసెట్టి శ్రీనివాస్, లక్ష్మి ,అపరంజి కుమారి , శిరీష మొదలైన వారు పాల్గొన్నారు.
Tags