జీ ఎన్ సాయిబాబా సంస్మరణ సభ
On
జీ ఎన్ సాయిబాబా సంస్మరణ సభ
కోరుట్ల అక్టోబర్ 21 (ప్రజా మంటలు) :
చేయని తప్పుకు ప్రాణాలు కోల్పోయిన ప్రొపెసర్ జీ ఎన్ సాయిబాబా అని ప్రజాస్వామ్య వేదిక అధ్యక్షుడు చెన్న విశ్వనాథం అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సి. ప్రభాకర్ స్మారక భవన్ లో సోమవారం ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆయన ఫోటో కు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చెన్న విశ్వనాథం మాట్లాడుతూ ఎలాంటి తప్పు లేకున్నా 10 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడని అనంతరం నిర్దోషిగా విడుదల అయినా తర్వాత మరణించాడని ఆయన మరణంను ప్రభుత్వ హత్యగా వించాలన్నారు. ఆయన ఆదివాసీలకు అండగా ఉండి వారి హక్కుల కోసం పోరాడిన దీరుడనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సి పీ ఏం జిల్లా కార్యదర్శి తిరుపతి నాయక్, చింత భూమేశ్వ ర్,, రాస భూమయ్య రాచకొండ దేవయ్య, ప్రజాస్వామ్య వేదిక సభ్యులు పాల్గొన్నారు.
-------------
Tags