జగిత్యాల జిల్లాలో డిగ్రీ కళాశాలల బంద్

నిధులు విడుదల  అయ్యేవరకు కళాశాలలు తెరువబోము

On

IMG-20241014-WA0098

 


జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు)


రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా కళాశాల లకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయక పోవడం తో పూర్తిగా ఈ పథకంతో నడిచే  రాష్ట్రం లోని డిగ్రీ కళాశాలలు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాయని , జీతాల చెల్లింపు, భవనాల అద్దెలు, వడ్డీల చెల్లింపు,  నిర్వహణ కూడా కష్టంగా వుందని తమకు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని అధికారులు, మంత్రులు అందరినీ కలిసి ఎన్ని సార్లు అడిగినా కనీస స్పందన లేదని ముఖ్యమంత్రి ని కలుద్దాం అని ఎన్ని సార్లు ప్రయత్నించినా సమయం ఇవ్వకపోవడం తో అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత చివరగా కళాశాలల నిరవధిక బందుకు డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ పిలుపు ఇవ్వడంతో జగిత్యాల జిల్లాలో అన్ని డిగ్రీ కళాశాలలు బందు లో పాల్గొన్నాయి.

ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయ్యే వరకు కళాశాలలు  తెరవబోమని డిగ్రీ  కళాశాలల జగిత్యాల జిల్లా అధ్యక్షులు పోతని ప్రవీణ్ మరియు జిల్లా డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు తెలిపారు.

Tags