డయల్ 100 కాల్స్ కి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకోవాలి - అశోక్ కుమార్

On
డయల్ 100 కాల్స్ కి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకోవాలి - అశోక్ కుమార్

డయల్ 100 కాల్స్ కి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకోవాలి
బుగ్గారం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బుగ్గారం అక్టోబర్ 09 (ప్రజా మంటలు) :

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా బుగ్గారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని  సూచించారు. ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. 

 

సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని  సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా   ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిది లోని ఉన్న గ్రామాల్లో  దసరా పండుగను ప్రశాంతంగా, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు కావలసిన భద్రత పరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీ.ఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి మరియు సిబ్బంది  పాల్గొన్నారు.

Tags