కొనసాగుతున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు

అన్నపూర్ణ దేవిగా అలంకరణ

On

 

 5d18453231b24db7896e2e30a066e0f6

 

జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు )

 

పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో ఆవరణలోని శ్రీ దుర్గాదేవి శరన్నరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. 

 

గురువారం అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. ఉదయం నిత్య పూజ, మంత్రపుష్పం, అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం డాక్టర్

మంగాదేవి - వెంకటరత్నం చే నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 

 

పీఠ క్షేత్రంలో వేద బ్రాహ్మణుల మంత్రోత్సరణల మద్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈబి కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మహిళలు, భక్తులు, పాల్గొన్నారు.

Tags