కొనసాగుతున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు
అన్నపూర్ణ దేవిగా అలంకరణ
On
జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు )
పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో ఆవరణలోని శ్రీ దుర్గాదేవి శరన్నరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి.
గురువారం అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. ఉదయం నిత్య పూజ, మంత్రపుష్పం, అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం డాక్టర్
మంగాదేవి - వెంకటరత్నం చే నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పీఠ క్షేత్రంలో వేద బ్రాహ్మణుల మంత్రోత్సరణల మద్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈబి కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మహిళలు, భక్తులు, పాల్గొన్నారు.
Tags