జగిత్యాల నుండి శబరిమలైకి మహాపాదయాత్ర

On

IMG-20241014-WA0074

 


జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు)
జగిత్యాల అయ్యప్ప ఆలయం నుండి 14 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి తో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మహాపాదయాత్రగా శబరిమలైకి ప్రయాణమయ్యారు. 16వ తేదీ కరీంనగర్ కు చేరుకొని తిరిగి అక్కడ నుండి మహా పాదయాత్ర ప్రారంభమగునుని స్వాములు తెలిపారు.

రోజుకు 32 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర కొనసాగునని తెలిపారు. తాము గత 12 సంవత్సరాలుగా మహా పాదయాత్ర కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

నవంబర్ 29న శబరిమలై ఆలయంలో స్వామి దర్శనం చేసుకొని 30వ తేదీన స్వామివారికి నెయ్యి అభిషేకం చేసుకొని తిరుగు ప్రయాణం కానున్నట్లు తెలిపారు.

ప్రతిరోజు బ్రాహ్మి ముహూర్తమున నాలుగు గంటల నుండి పాదయాత్ర కొనసాగిస్తామని తెలిపారులో లోకకళ్యాణార్థం మహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని స్వాములు పేర్కొన్నారు.

Tags