శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు

On
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు

జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు) :

జిల్లా కేంద్రం అరవింద నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి, శివ పంచాయతన, లలితా మాత దేవాలయం లో, దసరా శరన్నవరాత్రులలో  
 పంచ లోహా "శ్రీ చక్రం"ను  పౌరాణిక, జ్యోతిష్య, వేద పండితులు శ్రీ మాన్ నంబి వేణు గోపాల ఆచార్య కౌశిక చే స్థాపించడం జరిగింది.

ఈ రోజు నుండి ప్రతి శుక్రవారం మాతలచే సామూహిక కుంకుమ పూజలు చేయడానికి నిశ్చ యించారు.ఈ రోజు నుండి ప్రతి శుక్రవారం మన ఆలయం లో కుంకుమ పూజలు జరుగు తాయని, ఆలయ ఉపాధ్యక్షుడు కొత్త మోహన్ మాట్లాడుతూ తెలిపారు . ఉాటూరి రమ, కొత్త పెల్లి తనూజ, విరబత్తిని పద్మజ తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags