గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వంద కోట్ల టర్నోవర్ సాధించాలి
అదనపు కలెక్టర్ బి.ఎస్ లత
జగిత్యాల ఏప్రిల్ 10(ప్రజా మంటలు)
జగిత్యాల గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వందకోట్ల వ్యాపార టర్నోవర్ కు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆకాంక్షించారు.
గురువారం నాడు గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించిన గాయత్రి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంకు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించి, కర్ణాటక మహారాష్ట్ర లకు విస్తరించ తలపెట్టడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా సహకార అధికారి సి.హెచ్. మనోజ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా గాయత్రి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి వెనుక బ్యాంకు సీ.ఇ.వో, సిబ్బంది కృషి, పట్టుదల వున్నాయన్నారు. భవిష్యత్తులో గాయత్రి బ్యాంకు మరింత అభివృద్ధిని సాధించాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న లీడ్ బ్యాంకు మేనేజెర్ రాంకుమార్ మాట్లాడుతూ ఖాతాదారుల సమస్యల పరిష్కారంలో గాయత్రి బ్యాంక్ అగ్రస్థానంలో ఉందన్నారు. నిరార్ధక ఆస్తుల నిర్వహణలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పనితీరు అద్భుతం అని ప్రశంసించారు.
కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాయత్రి కోపరేటివ్ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. కార్యక్రమంలో గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ జి.ఎం(అడ్మిన్) శ్రీలత, జిల్లా సహకార శాఖాధికారి కార్యాలయం సూపరింటెండెంట్ బి.సుజాత, సహకార శాఖ సిబ్బంది, గాయత్రి బ్యాంకు ఖాతాదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర
