రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రదేశాలను సందర్శించిన ధర్మపురి సి.ఐ రామ్ నరసింహా రెడ్డి
గొల్లపల్లి మార్చి 23 (ప్రజా మంటలు)
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సురక్షిత ప్రయాణం కార్యక్రమం భాగంగా ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్) లను సందర్శించి మున్సిపల్, ఆర్ అండ్ బి, హైవే అథారిటీలతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ప్రజల విలువైన ప్రాణాలు కాపాడాలని ఆదేశించారు.ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు.
స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు కోసం తగిన సూచనలు చేశారు.ఈ చర్యలు రోడ్ ప్రమాదాలను తగ్గించడానికి, ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి తీసుకుంటున్నామని సురక్షిత ప్రయాణం కార్యక్రమం ప్రజల రోడ్ భద్రతను మెరుగుపరిచేలా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా సి.ఐ వాహనాలు నడిపే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు
డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి – మొబైల్ ఫోన్ వాడకూడదు, దృష్టి మరలకుండా జాగ్రత్తపడాలి.
ఈ సూచనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించుకోవచ్చని, ప్రయాణం సురక్షితంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఎస్.ఐ సతీష్, బుగ్గారం ఎస్ఐ ఎం. శ్రీధర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
