సర్ సి.వి.రామన్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అటవీ దినోత్సవ కార్యక్రమం
వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని గ్రహించాలి - ప్రిన్సిపాల్ కే నారాయణరెడ్డి
హుస్నాబాద్ మార్చ్ 21 (ప్రజామంటలు) ;
అంతర్జాతీయ అటవీ దినోత్సవం పురస్కరించుకొని సర్ సి.వి రామన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వృక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు వివిధ రకాల మొక్కలను పాఠశాల ఆవరణలో నాటి, వాటికి రక్షబంధనాన్ని కట్టడం జరిగింది. "వృక్షో రక్షతి రక్షితః" అన్న సూక్తిని గ్రహించి మనము చెట్లను నాటి, రక్షించి పెంచినట్లయితే అవి మనల్ని పర్యావరణాన్ని కాపాడుతాయని, అందరూ కూడా చెట్లను పెంచడమే కాక వాటిని సంరక్షించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాయిత నారాయణ రెడ్డి గారు అన్నారు. విద్యార్థులు తమ పుట్టినరోజు సందర్భంగా ఒక చెట్టును నాటినట్లయితే అది ఎంతోమందికి నీడనిస్తుందని చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
