నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన విద్య
సికింద్రాబాద్ మార్చి 23 (ప్రజామంటలు):
ప్రతి ఒక్కరిలో ఉండే శక్తి సామర్థ్యాలను వెలికి తీసేదే అసలైన విద్య అని, తనకు తాను పూర్తిగా తెలుసుకున్నప్పుడే వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని ప్రముఖ సామాజిక కార్యకర్త, రామకృష్ణ మఠం వాలంటీర్ ఆరేపాటి వెంకట నారాయణ రావు చెప్పారు.
ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడేది నిజమైన విద్య అని చెప్పారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని హరిహర కళాభవన్ లో శాంతినికేతన్ విద్యాసంస్థల 'శాన్ " స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్ ను విశ్వ గురువుచేయాలన్న స్వామి వివేకానంద కలను విద్యార్థులే సాకారం చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఊపిరి బిగబట్టేలా చేశాయి. కార్యక్రమంలో శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం, ప్రిన్సిపాల్స్, యోగ గురువు లివాంకర్, మణిశంకర్ మణికంఠన్, శ్రీవిద్య, శ్రీధర్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
