ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి
జగిత్యాల ఫిబ్రవరి 18(ప్రజా మంటలు)
*ప్రభుత్వ కార్యక్రమాల అమలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్*
ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.మంగళవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వ కార్యక్రమాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల జిల్లా కలెక్టర్ B.సత్య ప్రసాద్ కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు
త్రాగు నీటి సరఫరా, రబీ పంటలకు సాగు నీరు , డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలు పై ముఖ్య కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు.
17 వేల మెగా వాట్ల పీక్ డిమాండ్ వచ్చిన సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయని సీఎస్ తెలిపారు. వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగాలని, అవసరమైన మేర విద్యుత్తు అందుబాటులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి లోటు రావడానికి వీలు లేదని సిఎస్ పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని సి.ఎస్ కలెక్టర్లకు సూచించారు. ఫీడర్ల వద్ద సమస్యతో గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర య్యాయని,ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు.
మిషన్ భగీరథ, పట్టణాలలో అమృత్ క్రింద చేపట్టిన త్రాగు నీటి స్కీం, ఇతర త్రాగు నీటి స్కీంలకు, ఆసుపత్రులకు, వ్యవసాయ ఫీడర్లకు నిరంతరాయ సరఫరా ఉండే విధంగా ప్రత్యేకంగా పరిరక్షించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని సబ్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేస్తూ, అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని సి ఎస్ అన్నారు.
ప్రజా పాలన గ్రామ సభలలో కొన్ని సర్వే నెంబర్ లలో కొంత మేర సాగు భూమి వ్యవసాయెతర భూమి గా నమోదైందని తమ దృష్టికి తీసుకుని వచ్చారని, నేడు వాటిని సరి చేసే అవకాశం రైతు భరోసా పోర్టల్ లో అందించామని అన్నారు.
రైతు భరోసా పోర్టర్ లో మిగిలిన వ్యవసాయ భూముల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు 5 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. రైతు భరోసా పై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆ మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిఎస్ పేర్కొన్నారు.
యాసంగి పంటకు అవసరమైన ఎరువులు సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయని, జిల్లాలలో ప్రతి మండలంలో అవసరమైన ఎరువుల స్టాక్ ఉండే విధంగా కలెక్టర్ పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే సంప్రదించాలని, ఎక్కడైనా ప్యాక్ (పి.ఎ.సి.ఎస్) దగ్గర స్టాక్ లేకపోతే వెంటనే స్టాక్ అందించేలా చూడాలని అన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగు నీరు రైతులకు అందాలని, ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవాలని అన్నారు.
ఎస్సారెస్పీ సాగు నీరు అందే కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి రాబోయే మూడు వారాలపాటు అప్రమత్తంగా ఉంటూ పంటలు కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు.
రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో రావద్దని అన్నారు. మిషన్ భగీరథ గ్రిడ్ నీటి సరఫరా కోసం సోర్స్ వద్ద అవసరమైన నీటి నిల్వలు ఉండేలా నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని అన్నారు.
మిషన్ భగీరథ ఇబ్బందులు ఉన్న గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. గతంలో ఉన్న నీటి సరఫరా స్కీములు, పంప్ సెట్ ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొవాలని అన్నారు. జిల్లాలో నీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు.
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు మరొకసారి మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని సిఎస్ తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ , మహబూబ్ నగర్ జిల్లాలలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాలో కొత్త కార్డుల జారీ చేయాలని అన్నారు. రేషన్ కార్డులో స్క్రూట్ ని ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని సిఎస్ తెలిపారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలలో ఎదురయ్యే అనుభవాల పై నివేదిక అందించాలని సి ఎస్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ నుండి అదనపు కలెక్టర్ బి ఎస్ లత, డిఆర్డిఓ, రఘు వరుణ్ ఇన్చార్జి డిపిఓ మధన్ మోహన్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.
