ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి

On
ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలి::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి


జగిత్యాల ఫిబ్రవరి 18(ప్రజా మంటలు)

*ప్రభుత్వ కార్యక్రమాల అమలు  పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్*


ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.మంగళవారం  రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి  ప్రభుత్వ కార్యక్రమాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జగిత్యాల జిల్లా కలెక్టర్   B.సత్య ప్రసాద్ కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు 

త్రాగు నీటి సరఫరా, రబీ పంటలకు సాగు నీరు , డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలు పై ముఖ్య కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు. 

 17 వేల మెగా వాట్ల పీక్ డిమాండ్ వచ్చిన సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయని సీఎస్ తెలిపారు.  వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా  కొనసాగాలని, అవసరమైన మేర విద్యుత్తు అందుబాటులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి లోటు రావడానికి వీలు లేదని సిఎస్ పేర్కొన్నారు. 

విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని సి.ఎస్ కలెక్టర్లకు సూచించారు. ఫీడర్ల వద్ద సమస్యతో గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర య్యాయని,ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు.  

మిషన్ భగీరథ, పట్టణాలలో అమృత్ క్రింద చేపట్టిన త్రాగు నీటి స్కీం, ఇతర త్రాగు నీటి స్కీంలకు, ఆసుపత్రులకు, వ్యవసాయ ఫీడర్లకు నిరంతరాయ సరఫరా ఉండే విధంగా ప్రత్యేకంగా పరిరక్షించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని సబ్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేస్తూ, అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని సి ఎస్ అన్నారు. 

   ప్రజా పాలన గ్రామ సభలలో కొన్ని సర్వే నెంబర్ లలో కొంత మేర సాగు భూమి వ్యవసాయెతర భూమి గా నమోదైందని తమ దృష్టికి తీసుకుని వచ్చారని, నేడు వాటిని సరి చేసే అవకాశం రైతు భరోసా పోర్టల్ లో అందించామని అన్నారు. 

రైతు భరోసా పోర్టర్ లో  మిగిలిన వ్యవసాయ భూముల నమోదు ప్రక్రియను  జిల్లా కలెక్టర్లు 5 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. రైతు భరోసా పై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆ మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిఎస్ పేర్కొన్నారు. 

యాసంగి పంటకు అవసరమైన ఎరువులు సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయని, జిల్లాలలో ప్రతి మండలంలో అవసరమైన ఎరువుల స్టాక్ ఉండే విధంగా కలెక్టర్ పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే సంప్రదించాలని, ఎక్కడైనా ప్యాక్ (పి.ఎ.సి.ఎస్) దగ్గర స్టాక్ లేకపోతే వెంటనే స్టాక్ అందించేలా చూడాలని అన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగు నీరు రైతులకు అందాలని,  ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవాలని అన్నారు. 
ఎస్సారెస్పీ సాగు నీరు అందే కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి రాబోయే మూడు వారాలపాటు అప్రమత్తంగా ఉంటూ పంటలు కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు.‌

రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో రావద్దని అన్నారు.  మిషన్ భగీరథ గ్రిడ్ నీటి సరఫరా కోసం సోర్స్ వద్ద అవసరమైన నీటి నిల్వలు ఉండేలా నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని అన్నారు. 

మిషన్ భగీరథ ఇబ్బందులు ఉన్న గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. గతంలో ఉన్న నీటి సరఫరా స్కీములు, పంప్ సెట్ ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొవాలని అన్నారు.  జిల్లాలో నీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. 

  రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు మరొకసారి  మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని సిఎస్ తెలిపారు. 

ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ , మహబూబ్ నగర్ జిల్లాలలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.  ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాలో కొత్త కార్డుల జారీ చేయాలని అన్నారు.  రేషన్ కార్డులో స్క్రూట్ ని ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని సిఎస్ తెలిపారు. 
 
రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలలో ఎదురయ్యే అనుభవాల పై నివేదిక అందించాలని సి ఎస్ తెలిపారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ నుండి అదనపు కలెక్టర్ బి ఎస్ లత, డిఆర్డిఓ, రఘు వరుణ్ ఇన్చార్జి డిపిఓ మధన్ మోహన్  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్   కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్ హైదారాబాద్ మార్చ్ 16: శాసనమండలి సభ్యులు మరియు  తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ను, వారి నివాసంలో మాజీ మంత్రి జి.రాజేశం  మరియు BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతెన మధు  మర్యాదపూర్వకంగా కలిశారు.కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జి...
Read More...
Local News  State News 

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్  ఏళ్ళతరబడి పోరాట ఫలితం   బుగ్గారం/జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి) :  జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో భారీగా...
Read More...
Local News  State News  Spiritual  

బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు,  బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు  (రామ కిష్టయ్య సంగన భట్ల)     బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు హోమశాలలో...
Read More...
Local News  State News 

సీపీఆర్​ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు

సీపీఆర్​ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) : అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసుల ఉదంతం ఇది..వివరాలు ఇవి.. బేగంపేట పీఎన్​టీ జంక్షన్​ వద్ద రోడ్డు దాటుతూ ఓ  వ్యక్తి రోడ్డు పై పడిపోయడు. ఎండ తీవ్రత కారణంగా ఎండదెబ్బ తగిలి  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న...
Read More...
Local News 

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి   *  ప్రైవేట్​ స్కూళ్ళ నిర్వహణ సవాళ్ళతో కూడుకున్నది        *  కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) :  ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో మాత్రం రాజీ పడవద్దని, ఈ రోజుల్లో చదువుతోనే పిల్లల భవిష్యత్​ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి...
Read More...
Local News 

సి ఎం సహాయనిది చెక్కులు  నిరుపేదలకు  వరం ఎమ్మెల్యే డా. సంజయ్ 

సి ఎం సహాయనిది చెక్కులు  నిరుపేదలకు  వరం ఎమ్మెల్యే డా. సంజయ్     జగిత్యాల మార్చి16(  ప్రజా మంటలు   )  నియోజకవర్గానికి చెందిన 102 లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 28 లక్షల 25 వేల రూపాయల విలువగల చెక్కులను మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి  ఇవి పేదలకు  వరము లాంటిదని శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రజలు టీకాలు...
Read More...
Local News  State News 

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్ సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి. మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో  పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి,...
Read More...
Local News 

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్ మల్యాల /కొండగట్టు   మార్చి 15(ప్రజా మంటలు)                                                                             విద్యతో పాటు యువత క్రీడల్లో ముందుండాలని డి ఆర్డి ఏ పిడి రఘువరన్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర,భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ.    నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర   జగిత్యాల్ జిల్లా ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి యువ...
Read More...
Local News 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్  జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)  అలీం కో సంస్థ కార్పొరేషన్ సహకారంతో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో  చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకారణాలను పంపిణీ చేశారు.శనివారం రోజున జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) హైస్కూల్లో లో ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి.సత్య...
Read More...
Local News 

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)పైలెట్ ప్రాజెక్టు కిందనేటి నుండి జిల్లాలోని 21 ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్య బోధన  ప్రారంభం. జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్  గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా బోధనను ప్రారంభించిన కలెక్టర్. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా...
Read More...
Local News 

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. వందలాదిమంది సత్సంగ్ సభ్యులు, భక్తులు,రంగులు చల్లుకొని ఆటపాటలతో ఆడి పాడి, నృ త్యాలు చేస్తూ, కోలాటాలు ఆడారు. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు  బిరుదాంకితులు, బ్రహ్మశ్రీ సభాపతి విశుశ ర్మ దంపతులు, రంగుల పండుగ...
Read More...
Local News 

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని అష్టలక్ష్మి దేవాలయం లో, దశమ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 5వ రోజు సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, నిత్య హోమం, సామూహిక కుంకుమ పూజలు,ఘనంగా జరిగాయి .వైదిక కార్యక్రమం  వంశీకృష్ణమాచార్య బృందం , మరియు ఆలయ అర్చకులు రమేష్ పాండే ఘనంగా...
Read More...