డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి  - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

On
  డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి     - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి 

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల జూన్ 25 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని  సూచించారు. ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. జగిత్యాల పట్టణ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని  సూచించారు. టౌన్ పరిసరాలు ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు. పట్టణ పరిధిలో  ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా   ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు టౌన్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

డిఎస్పి రఘు చందర్ , టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్  మరియు సిబ్బంది  పాల్గొన్నారు.

Tags