అంధకారంలో కొత్తకొండ ఇందిరమ్మ బీసీ క్వార్టర్స్ కాలనీ

ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికార యంత్రాంగం

On
అంధకారంలో కొత్తకొండ ఇందిరమ్మ బీసీ క్వార్టర్స్ కాలనీ

భీమదేవరపల్లి సెప్టెంబర్ 24 (ప్రజామంటలు) :

మండలంలోని కొత్తకొండ గ్రామంలో గ్రామ అధికారులు బిల్లులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు అవసరాలు తీర్చడంలో, విధులు సక్రమంగా నిర్వహించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శికి గత కొద్ది రోజులుగా ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని చెప్పారు. కొద్దిరోజుల క్రితం ముగిసిన వినాయకచవితి సమయంలో లైట్లు పోయిన సమయంలో వేయమని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. ప్రతిరోజూ వేయాల్సిన వీధి దీపాలు వేయకుండా, సరైన విధంగా నల్లా నీరు ఇవ్వకుండా అపుడపుడు మురికి నీరు పంపిస్తూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని బీసీ క్వార్టర్స్ వాసులు కోరుతున్నారు.

Tags