నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్
*ప్రారంభించిన యూఎస్ఏ కాన్సులెట్ జనరల్
సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజామంటలు) :
చిన్న వయస్సులోనే తన గొప్ప ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చి, వరసగా ఓపెన్ లైబ్రరీలు ప్రారంభిస్తున్న చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందని హైదరాబాద్ లోని యూఎస్ఏ కాన్సులెట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం దమ్మాయిగూడ లోని జవహార్ నగర్ లో ఉన్న సేవాభారతి మహిళా శిక్షణ కేంద్రంలో 9వ తరగతి స్టూడెంట్ ఆకర్షణ ఏర్పాటు చేసిన లైబ్రరీని ఆమె ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ లైబ్రరీలో మొత్తం ఆరు వందల జనరల్ నాలెడ్జీ,తెలుగు ప్రేరణాత్మక కథలు, ఇంగ్లీష్ పుస్తకాలను ఉంచారు.
తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల నుంచి 14వేల 600 పుస్తకాలను ఆకర్షణ విరాళాల రూపంలో సేకరించడం గ్రేట్ అన్నారు. చిన్న వయస్సులో నిబద్దత కనబరుస్తూ, పుస్తకాలతో సమాజంలో పరివర్తన తేవాలనే ఆలోచన రావడం చాలా అరుదన్నారు. 13 ఏండ్ల ఆకర్షణ సతీష్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ఆకర్షణ తన 9ఏండ్ల వయస్సులో 2021 లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలు,క్యాన్సర్ ఆసుపత్రులు,పోలీస్ స్టేషన్లు,అనాధాశ్రయాలు, భరోసా కేంద్రం, జువైనెల్ హోమ్లు,ఎయిడ్స్ బాధిత పిల్లల కేంద్రాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేశారు.
గతంలో రాష్ర్టపతి, ప్రధానమంత్రి కూడ ఆకర్షణ గురించి తెలుసుకొని గుర్తించి, ప్రశంసించారు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా న్యూఢిల్లీలో జరిగిన రాష్ర్టపతి, ప్రధాన మంత్రి ఎట్ హోమ్ కార్యక్రమాల్లో కూడ ఆకర్షణ పాల్గొంది. ఆకర్షణ ప్రారంభించబోయే తన 25వ లైబ్రరీకి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వస్తానని హామి కూడ ఇచ్చారు. త్వరలో హైదరాబాద్ మెట్రో స్టేషన్ లల్లో లైబ్రరీలను ప్రారంభించబోతున్నట్లు ఆకర్షణ సతీష్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ
