ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
కరీంనగర్ 26 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
స్థానిక శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల కరీంనగర్ - వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మహారాష్ట్రలో బల్లార్షా ప్రాంతంలో ఉన్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి జాతీయ వృక్షశాస్త్ర బొటానికల్ గార్డెన్ ను డిగ్రీ మరియు పీజీ చదువుతున్న లైసెన్స్ విభాగ విద్యార్థులు సందర్శించారు.
ఈ బొటానికల్ గార్డెన్ 147 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉందని ఇందులో అనేక వృక్షజాతులు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, విదేశీ మొక్కలు, అక్వేరియం 360 డిగ్రీస్ మూవీ, 90 మూవీ గార్డెన్, రోస్ గార్డెన్, డైనోసార్యం, కాక్టీరియం, బయోడైవర్సిటీ పార్క్, ఓపెన్ సైన్స్ మ్యూజియం, మెడిసినల్ గార్డెన్, వెజిటేబుల్ గార్డెన్ తో పాటుగా అత్యంత విశిష్టమైన విజ్ఞాన భాండాగారం లైబ్రరీ కలిగి ఉండి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారితో అనుసంధానించబడి హెర్బెరియంలను కూడా నిర్వహిస్తుంది.
ఈ హెర్బెరియం లను విద్యార్థులు అధ్యాపకులు సందర్శించి ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ గారు మాట్లాడుతూ.....
బొటానికల్ టూర్ విద్యార్థులలో వృక్షశాస్త్రం పట్ల మక్కువను పెంపొందించడమే కాకుండా ప్రత్యక్ష అనుభవాలను పెంపొందిస్తూ నూతన విజ్ఞానాన్ని నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఔషధ మొక్కల ఆవశ్యకతను మొక్కల సంరక్షణలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను కూడా ప్రత్యక్షంగా గమనించవచ్చని ఇలాంటి విజ్ఞాన వృక్ష శాస్త్ర విజ్ఞాన పర్యటనలు విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వృక్ష శాస్త్ర విభాగాధిపతి కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుక్వెల శ్రీనివాస్ మాట్లాడుతూ....
46 మంది విద్యార్థులు డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ బొటానికల్ టూర్ ను వినియోగించుకున్నారని మహారాష్ట్రలోని బల్లార్షా లో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి నేషనల్ బొటానికల్ గార్డెను 26వ తారీఖున రోజంతా కూడా ఎంతో ఆసక్తితో సందర్శించి ముఖ్యమైన అంశాలను గైడ్ సహాయంతో నోటు చేసుకున్నారని పేర్కొన్నారు.
వీరితో పాటుగా కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ రైతు రాధాకృష్ణ, డాక్టర్ పడాల తిరుపతి, డాక్టర్ ఆసంపల్లి స్వరూప రాణి, డాక్టర్ మహమ్మద్ తాజుద్దీన్, డాక్టర్ దాస్యపు రమ్య తదితర అధ్యాపకులు మరియు డిగ్రీ చదువుతున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటుగా పీజీ చదువుతున్న గొల్లపల్లి నవీన్ మరియు బుడిగే అరవింద్ అనే విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రణాళికతో అవసరమైన ఏర్పాట్లతో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకోవడంలో తగు సూచనలు సలహాలు ఇచ్చిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ లకు విద్యార్థులు అధ్యాపకులు కళాశాల వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ తిరుక్వెల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మారు ఇలాంటి వినూత్నమైన వృక్ష శాస్త్ర విభాగ క్షేత్ర పర్యటనలు తప్పకుండా మళ్లీ చేస్తామని విద్యార్థులలో నూతన ఉత్తేజాన్ని నింపుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
