పద్మారావు నగర్లో అకాల వర్షం...అంతా అతాలకుతలం..
*సెల్లార్లలోకి వర్షపునీరు..మునిగిన బైకులు..
*చెరువుల్లాగా మారిన రోడ్లు
*ఇండ్లల్లోకి చేరిన వాన నీరు
*వెంకటాపురం కాలనీలో కూలిన ప్రహరీ
సికింద్రాబాద్ ఏప్రిల్ 03 (ప్రజామంటలు):
సిటీలో మద్యాహ్నం కురిసిన అకాల వర్షానికి అంతా అతలాకుతలం అయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావునగర్ వెంకటపురం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న తుంగభద్ర మహిళా మండలి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆరు నెలల క్రితం గుంతలు తవ్వి వదిలేశారు. పనులు ఇంకా మొదలు కాలేదు. గురువారం కురిసిన వానకు కాలనీకి చెందిన వరద నీరు మొత్తం ఈ కమ్యూనిటీ హాలు స్థలంలో నిండిపోయి , ప్రహరీ గోడ కుప్పకూలింది. దాంతో వరద నీరు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి వెళ్లడంతో నిత్యవసర వస్తువులన్నీ పాడైపోయాయి. అన్ని గదుల్లో నీళ్లు వెళ్ళడంతో బకెట్లతో నీళ్లు బయట పారబోశారు. మున్సిపల్ అధికారులు సకాలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఉంటే ఈరోజు తమకు ఈ దుస్థితి వచ్చేది కాదని వెంకటాపురం కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
పలు అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి నీరు చేరడంతో బైకులు నీట మునిగాయి, పంపులు సాయంతో సెల్లార్ లోని వాన నీటిని బయటకు పంపింగ్ చేశారు. బౌద్దనగర్ డివిజన్ లో అకాల వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎల్ ఎన్ ఆర్ నగర్ లో రోడ్లు నీట మునగగా, ఇండ్లల్లోకి నీరు వచ్చాయని స్థానికులు వాపోయారు. బన్సీలాల్ పేట సేవా సంఘం కమ్యూనిటీ హాల్ సమీపంలోని డీ క్లాస్ ప్రాంతంలో రోడ్లు జలమయం అయి, ఇండ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు నీట మునిగాయి. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వంద కోట్ల టర్నోవర్ సాధించాలి

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

జెట్ సెట్ నైట్క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్
.jpg)
చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి
.jpg)