చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

On
చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

వాహనాలు ఇచ్చినా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు

సికింద్రాబాద్ ఏప్రిల్ 10 (ప్రజామంటలు) :

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వాహనలు నడిపిన వారి పై చట్టపరమైన చర్యలు  తప్పవని ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు హెచ్చరించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎల్.మధు బాబు తో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.

 ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్ రాజు మాట్లాడుతూ, ఉన్నత అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా మైనర్లు వాహనాలు నడపడం పై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించామన్నారు.ఉత్తర మండలం  పరిధిలో 109 కేసు లు నమోదైనట్లు  వెల్లడించారు.వీరిలో మైనర్లు అత్యధికంగా ఉన్నారని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈసందర్భంగా గుర్తు చేశారు.

మోటారు వాహన చట్టం 1988 సెక్షన్ 180 ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి నందు కాను వెయ్యి రూపాయల జరిమాన తో పాటు మూడు నెలల జైలు శిక్ష, లేదా ఈ రెండు కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.సెక్షన్ 181 ప్రకారం డ్రైవింగ్ చేసే వాహనదారుడు వయస్సు సరిపోకపోతే 500 రూపాయల జరిమాన లేదా మూడు నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది, సెక్షన్ 207 ప్రకారం వాహనానికి రిజిస్ట్రేషన్, పర్మిట్ లేకుండా నడిపితే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇక మైనర్లు తప్పు చేస్తే సెక్షన్ 199ఏ 2019 ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు అవుతుందని, ఆ వాహనదారుడు కి 25 ఏళ్లు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం లేదన్నారు. మైనర్లు వాహనాలను నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు.

మైనర్ల తల్లిదండ్రులకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సిల్లిగ్ నిర్వహించారు. అనంతరం చట్టాల పై అవగాహన కల్పించారు.చట్టాన్ని గౌరవిద్దాం, నియమాలకు లోబడి వాహనాలు నడుపుదాం అంటూ తల్లిదండ్రులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.ఉత్తర మండలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి బోయిన్ పల్లి 17, తిరుమలగిరి 19, మరేడ్ పల్లి 23, బేగంపేట 24,గోపాలపురం09, మహంకాళీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 కేసులు నమోదైనట్లు జి.శంకర్ రాజ్ వెల్లడించారు. ఈకార్యక్రమంలో మైనర్ పిల్లల వారి తల్లిదండ్రులు,ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

State News 

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

విడిసి చొరవతో... రాలిన పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...? గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి బుగ్గారం ఏప్రిల్ 18: గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత...
Read More...
Local News 

జై సూర్య ధన్వంతరి  ఆధ్వర్యంలో కుంకుమ పూజలు 

జై సూర్య ధన్వంతరి  ఆధ్వర్యంలో కుంకుమ పూజలు  గొల్లపల్లి ఎప్రిల్ 18 (ప్రజా మంటలు): శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం  యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం  మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమ ర్పం చారు కుంకుమ...
Read More...
Local News 

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది *సేవలో తరిస్తున్న వాసవి మహిళ సంఘం ఎంతో  గ్రేట్..    *విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ సరోజ వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): ఫ్యాషన్ వల్లే  మనం ఏదైనా సాధించ గలుగుతామని. అలాగే వాసవి మహిళా సంఘం నిర్వాహకులు  నిరుపేదల సేవలో చురుగ్గా పాల్గొంటు, తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ, డా.అంబేడ్కర్...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని చందోలి, బొంకూరు, వెనుగుమట్ల, లోత్తునూరు,వెంగళపూర్, శంకర్రావుపేట్ గ్రామాల్లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్  గురువారం రోజు ప్రారంభించారు.ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలలో రైతులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా  అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను...
Read More...
Local News 

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ    సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ( ప్రజామంటలు): అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో  ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్...
Read More...
Local News 

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు విజయం సాధించిన డా.సుభోద్, డా.రాజేశ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి యూనిట్ లో ఇటీవల ఖాళీ అయిన రెండు జనరల్ కౌన్సిల్ మెంబర్ (ఒకటి ప్రొఫెసర్ క్యాడర్, మరొకటి అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ) పోస్టులకు గురువారం గాంధీ ఆసుపత్రిలో ఎన్నికలు జరిగాయి. ఉదయం...
Read More...
Local News 

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి 

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని వెంగలాపూర్ అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ మల్యాల వీరలక్ష్మి  ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా  పిల్లల బరువుల గురించి తల్లులకు అవగాహన కల్పించడం  బరువు తక్కువ ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మరియు స్థానికంగా లభించే పండ్లు కూరగాయలు గుడ్డు ఆకుకూరలు పాలు వల్ల...
Read More...
State News 

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు   జపాన్ పర్యటన నుంచి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి   మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని అధికారులను ఆదేశించిన సీఎం  (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి ఎప్రిల్ 17:ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి...
Read More...
Local News 

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
Read More...
Local News 

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది - ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
Read More...
Local News 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి  గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళి అక్కడ ఇటీవల హత్యకు గురికాగ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  బుధవారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు....
Read More...
Local News 

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర సికింద్రాబాద్  ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):  దశాబ్దల తరబడిగా ముదిరాజులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 18 నుంచి ముదిరాజ్ నాయకులు యువరాజ్ పాదయాత్ర చేపట్టబోతున్నారు.  మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని జాతీయ కోలీ సమాజ్ ఈసీ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ తెలిపారు. మేడారం...
Read More...