జగిత్యాల సూర్య గ్లోబల్లో...అలరించిన సంస్కృతి, నాగరికత ప్రదర్శన...
ప్రదర్శన ప్రారంభించిన జిల్లా విద్యాధికారి రాము
జగిత్యాల ఎప్రిల్ 03:
సూర్య గ్లోబల్ స్కూల్ లోనిర్వహించిన దేశ ప్రగతికి పట్టుగొమ్మలుగా నిలిచే సంస్కృతి, నాగరికత అంశాల ప్రదర్శనతో చిన్నారులు అలరించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్యా గ్లోబల్ స్కూల్ లో గురువారం విద్యార్థులు భారతీయ సంస్కృతి-నాగరికతల వైభవాన్ని కండ్లకు కట్టేలా పలు అంశాలను ప్రదర్శింపజేసి అందరిని విస్మయానికి, గురి చేశారు.
భిన్నత్వంలో ఏకత్వంకు ప్రతీకగా నిలిచే భారతీయ సంస్కృతిక అంశాలను రాష్ట్రాల వారిగా పిల్లలు ప్రదర్శించారు.పిల్లల్లో జ్ఞాన ఆర్జన ఆసక్తిని పెంచిన పాఠశాల యాజమాన్యంకు అభినందనలు అన్నారు. జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు దేశంలోని అన్ని రాష్ట్రాల వేషధారణతో ఆ రాష్ట్రాల ప్రాముఖ్యతను తెలియజేయడం అద్భుతమన్నారు.
గుజరాతీ వేషధారణతో పాటు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన గర్భా, డాండియా నృత్యాలను ప్రదర్శిఃచారు, సోమనాథ్ ఆలయం, స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ, గిర్ నేషనల్ పార్క్ వంటి ప్రఖ్యాత నిర్మాణాల నమూనాలను ప్రదర్శించారు.
ధోఖ్లా, థెప్లా, ఖామాన్ వంటకాలను సైతం వండి వడ్డించారు. మన రాష్ట్రానికి చెందిన చార్మినార్, రామప్ప దేవాలయాల నమూనాలతో పాటు, బోనాలు, బతుకమ్మ, ప్రసిద్ధ ఆహారం - సరకొర్ర బియ్యం, దోశ, హైదరాబాద్ బిర్యానిని రుచి చూపించారు. ఆంధ్రప్రదేశ్ - తిరుమల తిరుపతి, విశాఖ బీచ్, కూచిపూడి నృత్యం, గుత్తివంకాయ కూర, తమిళనాడుకు చెందిన బృహదీశ్వరాలయం నమూనాతో పాటు, భరతనాట్యం, ఇడ్లీ-సాంబార్ వంటకాలను ప్రదర్శించారు. కర్ణాటకలోని హంపి, మైసూర్ ప్యాలెస్ నమూనాలు, యక్షగానం ప్రదర్శన, బెంగళూరు బిర్యాని లాంటి వంటకాలను చేపట్టారు.
రాజస్థాన్కు చెందిన నిర్మాణాలైన జైపూర్ హవా మహల్, థార్ ఎడారి, ప్రసిద్ది చెందిన ఘూమర్ నృత్యం, దాల్ బాటీ చూర్మా వంటకాలను తయారు చేశారు. ఉత్తర ప్రదేశ్కి చెందిన తాజ్ మహల్, కాశీ విశ్వనాథ్ మందిరం, కతక్ నృత్యం, అవధీ బిర్యానీ, పశ్చిమ బెంగాల్ - సుందర్ బన్స్, హౌరా బ్రిడ్జ్, రసగుల్లా, ఒడిసి నృత్యం, మహారాష్ర్టకు చెందిన గేట్ వే ఆఫ్ ఇండియా, లవణీ నృత్యం, వడాపావ్ వంటకం, పంజాబ్కు చెందిన గోల్డెన్ టెంపుల్, భాంగ్రా డాన్స్, మక్కీ రోటీ, సర్పనీరలాంటి వంటకాలను తయారు చేసి ఆతులకు వడ్డించారు. సాంస్కృతిక అంశాలతో పాటు, సాంకేతిక అంశాల ఘనతను సైతం ప్రదర్శించారు.
గణిత శాస్త్రవేత్తల ప్రతిభ, ఆవిష్కరణలు, భౌతిక, రసాయన, జీవ, వృక్ష శాసా్త్రల్లోని ముఖ్యమైన ఫార్ములాలను పిల్లలు ప్రదర్శించారు.
మానవ దేహంలోని బ్లడ్ గ్రూప్లను వివరించడంతో పాటు, అక్కడికి వచ్చిన ఆతుల వద్ద నుండి బ్లడ్ సాంపిల్స్ సేకరించి, రక్తనమూనాలను తెలియజేయడం అందరిని ఆశ్చర్యంతో పాటు, ఆనందానికి గురి చేసింది. వీటితో పాటు ఇస్రో, ఆటమిక్ సెంటర్ నమూనాలను సైతం చిన్నారులు రూపొందించారు.
సామాజిక జీవనంలో కీలక పాత్ర పోషించే పోలీసు, డాక్టర్, ఉపాధ్యాయుడు, సైనికుడు, న్యాయమూర్తి, ఇంజనీర్, ఆర్మీ స్పేస్ సెంటర్, రైతు, టైలర్, బ్యుటీషియన్ లాంటి వృత్తులను సైతం పిల్లలు సచిత్రంగా, సవివరణంగా సాంకేతిక వస్తు సామాగ్రీతో సహా ప్రదర్శింజేసి ఔరా అనిపించుకున్నారు.
ఈ కార్యక్రమానికి హజరైన జిల్లా విద్యాధికారి కె. రాము మాట్లాడుతూ, స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను గుర్తించి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం వల్ల పిల్లల్లో స్ఫూర్తిని నింపవచ్చునన్నారు. చిన్నవయసులోనే పిల్లలకు సాంసృతిక, నాగరికత అంశాలతో పాటు, సామాజిక అంశాలపై ఒక సృహా రావడం గొప్పవిషయమన్నారు.
తెలంగాణ లోని వంటకాలు అభిరుచులను తెలియజేస్తూ 700 మంది చిన్నారులు ప్రదర్శించిన ఇవ్వడం చాలా అరుదైన అంశమన్నారు. చిన్నారులు కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ను వంటబట్టించుకొని, అందమైన జీవితానికి మార్గాలు వేసుకోవాలని కోరారు.
ఇందులో శ్రీధర్ రావు, సీనియర్ పాత్రికేయులు సిరిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బోయినిపెల్లి శ్రీధర్ రావు, డైరెక్టర్లు మంజుల రమాదేవి, హరిచరణ్ రావు, రజిత రావు, సుమన్ రావు , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వంద కోట్ల టర్నోవర్ సాధించాలి

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

జెట్ సెట్ నైట్క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్
.jpg)
చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి
.jpg)
మహాంకాళి ఠాణాలో కోఆర్డినేషన్ మీటింగ్
