మెట్ పల్లి పట్టణంలో 346 ఆటోలకి క్యూ ఆర్ కోడ్ తో అనుసంధానం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణలో బాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మెట్ పెల్లి మార్చి 26(ప్రజా మంటలు)
మహిళలు, వృద్ధులు, ప్రయాణికులు సురక్షిత ప్రయాణం, భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన *మై ఆటో ఈస్ సేఫ్*అనే కార్యక్రమం ను మెట్ పల్లి పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... మహిళలు, వృద్ధులు, ప్రయాణికుల సురక్షిత, భద్రత కొరకు మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో 4000 లకు పైగా ఆటోలు ఉన్నాయని ఇప్పటి వరకు 2500 లకు పైగా ఆటోలకు క్యూఆర్ కోడ్ తో అనుసంధానం చేయడం జరిగిందన్నారు.
రాబోవు రోజుల్లో మిగతా ఆటోలో కూడా ఈ యొక్క స్టిక్కరింగ్ వేయడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు మెట్ పల్లి పట్టణంలో సుమారు 346 ఆటో లకు (ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా) స్టిక్కరింగ్ చేయడం జరిగిందని ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు *మై ఆటో ఈస్ సేఫ్*అనే స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలని సూచించారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదేనా సమస్య ఎదురైతే ఆటో డ్రైవర్ సీట్ వెనకాల గల క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే అట్టి ఆటో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్ నందు కనిపిస్తుంది వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్,ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు.
ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు పోలీస్ వారు అ యొక్క సమాచారం ఆదారంగా వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా *”సురక్షిత ప్రయాణం”* అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి తరచూ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను సందర్శిస్తూ వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదల నివారణలో ఆటో డ్రైవర్లు కూడా భాగస్వాములై ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు, ఆర్ టి వో శ్రీనివాస్, మెటపల్లి సీ.ఐ అనిల్ కుమార్, ఎస్.ఐ లు కిరణ్ కుమార్,రాజు,పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు,ఓనర్స్ పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
