మెట్ పల్లి పట్టణంలో 346 ఆటోలకి క్యూ ఆర్ కోడ్ తో అనుసంధానం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణలో బాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మెట్ పెల్లి మార్చి 26(ప్రజా మంటలు)
మహిళలు, వృద్ధులు, ప్రయాణికులు సురక్షిత ప్రయాణం, భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన *మై ఆటో ఈస్ సేఫ్*అనే కార్యక్రమం ను మెట్ పల్లి పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... మహిళలు, వృద్ధులు, ప్రయాణికుల సురక్షిత, భద్రత కొరకు మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో 4000 లకు పైగా ఆటోలు ఉన్నాయని ఇప్పటి వరకు 2500 లకు పైగా ఆటోలకు క్యూఆర్ కోడ్ తో అనుసంధానం చేయడం జరిగిందన్నారు.
రాబోవు రోజుల్లో మిగతా ఆటోలో కూడా ఈ యొక్క స్టిక్కరింగ్ వేయడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు మెట్ పల్లి పట్టణంలో సుమారు 346 ఆటో లకు (ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా) స్టిక్కరింగ్ చేయడం జరిగిందని ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు *మై ఆటో ఈస్ సేఫ్*అనే స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలని సూచించారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదేనా సమస్య ఎదురైతే ఆటో డ్రైవర్ సీట్ వెనకాల గల క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే అట్టి ఆటో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్ నందు కనిపిస్తుంది వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్,ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు.
ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు పోలీస్ వారు అ యొక్క సమాచారం ఆదారంగా వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా *”సురక్షిత ప్రయాణం”* అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి తరచూ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను సందర్శిస్తూ వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదల నివారణలో ఆటో డ్రైవర్లు కూడా భాగస్వాములై ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు, ఆర్ టి వో శ్రీనివాస్, మెటపల్లి సీ.ఐ అనిల్ కుమార్, ఎస్.ఐ లు కిరణ్ కుమార్,రాజు,పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు,ఓనర్స్ పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
