అంబేద్కర్ ఆశయ సాధనే ఘనమైన నివాళి
గొల్లపల్లి (జగిత్యాల)
మార్చి 23(ప్రజా మంటలు)
ప్రభుద్ద భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యనిర్వాహక సభ్యులు డిక్కీ జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో, ప్రతి ఆదివారం, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమం లో భాగంగా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు డబ్బా లక్ష్మారెడ్డి పూలమాల వేశారు.
అంబేద్కర్ కు ఘనమైన నివాళులు అర్పిస్తూ, భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, అంబేద్కర్ ని ప్రపంచ జ్ఞానిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అలాంటి మహాను భావునికి మన భారతదేశ మొత్తం రుణపడి ఉండి ,వారిని గౌరవించుకోవడం మన సాంప్రదాయం అని అన్నారు.
సీనియర్ న్యాయవాది తాండ్ర సురేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వలన ఈరోజు నేను బహుజన బిడ్డగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను ,అంబేద్కర్ కొందరి వాడి కాదు అందరివాడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రపంచ జ్ఞాని అని మాట్లాడారు. సీనియర న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బండ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నారు, దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేస్తూ బీసీలు ,ఓసీలు ,మైనార్టీలు ,ప్రజలందరూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ,వారు అందరివాడు అందరి కొరకు అన్ని ఇచ్చిన మహానుభావుడు వారికి మనము చేసుకున్న రుణం తీర్చుకుంటున్నాము అన్నారు.
ఈ కార్యక్రమానికి నాయకులు బండ శంకర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నకుమల్ల లక్ష్మీనారాయణ, మద్దెల నారాయణ, బొంకంటి రవి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు వెంగలాపూరం , రాజేష్ ప్రవీణ్ ,కంచి సురేష్ భూసారపు శ్రీనివాస్ అడ్వకేట్,పల్లె రవి, ముద్దమల్ల గంగాధర్, కాయితి శ్రీనివాస్, జయరాజ్, తక్కల్ల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
