చిన్నారుల వినికిడి లోపాలను మొదట్లోనే గుర్తించాలి.. 

On
చిన్నారుల వినికిడి లోపాలను మొదట్లోనే గుర్తించాలి.. 


   *  వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్. 
  * 40 మంది చిన్నారులకు హియరింగ్​ ఎయిడ్స్​ పంపిణీ 
  * ఇక నుంచి 5 ఏండ్ల పిల్లల వరకు కాక్లియర్​ ఇంప్లాంట్ సర్జరీలు...

సికింద్రాబాద్​ మార్చి 03 (ప్రజామంటలు) :

చిన్న వయస్సులో ప్రాథమిక దశలో గుర్తిస్తే వినికిడి సమస్యలకు ట్రీట్మెంట్ అందించవచ్చని తెలంగాణ రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.  వరల్డ్ హియరింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మీనాక్షి వెంకట్ రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మంది చిన్నారులకు వినికిడి యంత్రాలను (హియరింగ్ ఏయడ్స్​) అందజేశారు. సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజ్ ఆలూమ్ని భవనం, సెమినార్ ఆడిటోరియంలో  సోమవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా అటెండ్​ అయ్యారు.  మానవ శరీరంలో ఏదైనా అవయవం పని చేయనప్పుడే దాని విలువ తెలుస్తుందన్నారు. పుట్టిన చిన్నారి శబ్దం విని దానిని గ్రహించకపోతే మాటలు కూడా రావని అందుకే శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు చికిత్స అందించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.  తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వెన్షన్  సెంటర్లలో  ఆడియోలాజిస్టులను నియమిస్తామని చెప్పారు. ఎం.వి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జివి. సేతురామన్ మాట్లాడుతూ 2013లో సేవలు ప్రారంభించిన తమ ఫౌండేషన్ ఇప్పటివరకు రెండు లక్షల మంది చిన్నారులకు వినికిడి పరీక్షలు నిర్వహించిందని, 2700 మంది పిల్లలకు దాతల సహకారంతో వినికిడి యంత్రాలను సమకూర్చడం జరిగిందని అన్నారు. పద్మారావు నగర్ లోని తమ సిటీ సెంటర్ లో  పిల్లలకు వారి తల్లులకు స్పీచ్ తెరపీ పై శిక్షణ ఇస్తున్నామని, వినికిడి సమస్యలు ఉన్న పిల్లలను సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని తమ ఫౌండేషన్ లక్ష్యమని ఆయన అన్నారు. 

ఇక నుంచి ఐదేండ్ల పిల్లల వరకు కాక్లియర్​ ఇంప్లాంట్ సర్జరీ:

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మూడేళ్ల లోపు ఉన్న  చిన్నారులకు  దాదాపు రూ ఆరున్నర లక్షల విలువ చేసే  కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ  ఉచితంగా చేస్తున్నామని, కాని  గాంధీ ఆసుపత్రి ఈఎన్​టీ హెచ్​ఓడీ డా.భూపేందర్​ సింగ్​ రాథోడ్​ చేసిన విజ్ఞప్తి మేరకు దానిని త్వరలో ఐదేళ్ల వయసు వరకు పొడిగించనున్నామని ఆయన అన్నారు. అలాగే కేవలం ఒకటే చెవికి మాత్రమే ఉన్న పథకాన్ని రెండు చెవులకు కూడా చికిత్స చేసేందుకు త్వరలో అనుమతి విడుదల చేస్తామని చెప్పారు. కోఠి లోని ఈ ఎన్ టి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల కోసం పెండింగ్ కేసులను  త్వరితగతిన పూర్తి చేసేందుకు  ఆదేశిస్తామని ఆయన అన్నారు. గాంధీ ఆసుపత్రిలో కూడా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి అవసరమైన మెడికల్​ ఎక్విప్​ మెంట్​ ను  అందిస్తామని  తెలిపారు.  గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ రాజకుమారి, ఈ ఎన్ టి విభాగం హెచ్ఓడి డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, డోనర్​ ఆదినారాయణ, ఎంవి ఫౌండేషన్ ట్రస్టీ వసంత సేతురామన్, డైరెక్టర్ డాక్టర్ రంగనాథన్​, మురళి నటరాజన్, ప్రసాదరావు,సిబ్బంది పాల్గొన్నారు. తమ పిల్లలకు వినికిడి శక్తి పరీక్షలను నిర్వహించి, ఉచితంగా వినికిడి పరికరాలను అందజేసిన ఎం.వి ఫౌండేషన్ కు వివిధ జిల్లా నుంచి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

Tags

More News...

Local News 

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 1(ప్రజా మంటలు)సన్న బియ్యం పేదల పాలిట వరం అన్నారు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పట్టణ 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నిరుపేదలకు...
Read More...
Local News 

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు   జగిత్యాల ఏప్రిల్ 01: బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు  తరలివెళ్లారు. ఈ...
Read More...
Local News 

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు  ప్రథమ స్థానంలో  దొనకొండ.సుధీర్ శకల్ల గారి పావుతుల బంగారం మూస్క్ నిశాంతిరెడ్డి అందజేశారు   ధ్వితిమ స్థానంలో క్యతం.జితేందర్ జగదేవ్ పేట,  వారికి 10గ్రా వెండి కీర్తిశేషులు దాసరి లచ్చవ్వ -భీమయ్య...
Read More...
Local News 

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని *15 ఏండ్లుగా ప్రతి వేసవిలో అన్నదానం, చలివేంద్రం   *ఆదర్శంగా శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ట్రస్ట్    సికింద్రాబాద్, ఏప్రిల్ 01 (ప్రజామంటలు) :    వయస్సు పైబడిన కూడ పేద ప్రజలకు సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని...
Read More...
Local News 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య  గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఎనగందుల జయంతి 25 సం డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నది. జయంతి గత కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో  మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో,  రూమ్ లో ఐరన్...
Read More...
Local News 

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య. గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)      గొల్లపల్లి మండలము లోని గోవింద పల్లె గ్రామానికి చెందిన  చెందిన బింగి వెంకటమ్మ 72 సం వృద్ధురాలు కొంతకాలం నుండి  థైరాయిడ్  షుగర్ సంబంధిత వ్యాధులతో బాధ పడుతూ డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ  20 రోజుల క్రితం వెంకటమ్మకు కడుపులో నొప్పి రాగా, కొడుకు
Read More...
Local News 

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ సికింద్రాబాద్, ఏప్రిల్ 01 ( ప్రజామంటలు ) :    అసలే పేదరికం..ఆపై అనారోగ్య సమస్యలు..శరీరం సహకరించక మద్యలోనే చదువు ఆపేసిన  యువతికి ఓ సంస్థ అండగా నిలిచింది. వివరాలు ఇవి..బన్సీలాల్ పేట డివిజన్ జయనగర్ కు చెందిన డి.దశరథ్, వాణీ ల కుమార్తె పూజిత(17) డయాబెటిక్, థైరాయిడ్ తో బాధపడుతోంది. తన మూడేండ్ల వయస్సు నుంచే...
Read More...

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం 

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం  జగిత్యాల ఏప్రిల్ 1( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత ఐదు వారాలుగా ప్రతి మంగళవారం జరుగుతున్న సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఈ  మంగళవారం ఐదో వారము కు చేరింది.  ఈనాటి హనుమాన్ చాలీసా పారాయణoలో భక్తులు  విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు...
Read More...
Local News 

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే...
Read More...
Local News 

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం    మార్చి 31 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయిసప్తాహం ప్రారంభమైంది. ఈరోజు సోమవారం నుండి వచ్చే సోమవారం వరకు అఖండ సాయి నామ సప్తహం జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. సన్నిధిలో ఒక వెయ్యి ఎనిమిది కలుశాలు స్థాపించి ప్రతిరోజు పూజలు జరుగుతాయని, ఎనిమిదో రోజు మళ్లీ...
Read More...
Local News 

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు  పోటీల్లో నిర్వహించారు ఈ పోటీల్లో 16 బండ్లు పాల్గొనగా విజేతలకు    బహుమతులు అందజేశారు మొదటి బహుమతి షేక్ అక్బర్ తిర్మలపూర్ కు బాయిన లక్ష్మి- లక్ష్మయ్య పావుతున్న బంగారం అందజేశారు, ద్వితీయ...
Read More...
Local News 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు  గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూరులోని  శ్రీరామలింగేశ్వర స్వామి  జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి జాతర ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామంలోని  ప్రధాన వీధుల గుండా  నిర్వహించిన రథోత్సవాన్ని చూడటానికి మండల నలుమూల గ్రామాల  భక్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ...
Read More...