ఘనంగా దుర్గ అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర..
On
జగిత్యాల అక్టోబర్ 12 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో
గత తొమ్మిది రోజులుగా జిల్లా కేంద్రంలో వివిధ మంటపాల వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు అందుకున్నారు అమ్మవారు కాగా శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక వాహనాలపై అమ్మవారి విగ్రహాలను ఉంచి శోభాయాత్రగా పట్టణ ప్రధాన వీధుల గుండా మంగళ వాద్యాల నడుమ భక్తులకు దర్శనం ఇచ్చారు.
శోభ యాత్రలో భవాని దీక్షపరులు ,భజనలు చేస్తూ అమ్మవారి కీర్తనలతో శోభాయాత్రను కొనసాగించారు.
శోభాయాత్రలో జయ జయ ద్వానాలతో ప్రధాన వీధులన్నీ మారుమోగాయి. భక్తులు విశేష సంఖ్యలో శోభాయాత్రను తిలకించి నేత్రనంద భరితులయ్యారు.
Tags