జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీలో మన ఊరు మన ఆత్మగౌరవం
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల మార్చి 31 (ప్రజా మంటలు)
పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ స్థానిక తాటిపల్లి గ్రామంలో మన ఊరు మన ఆత్మగౌరవం (MY VILLAGE MY PRIDE) పేరిట పల్లెదనం ప్రతిబింబించేలా వినూత్న కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పిల్లల యొక్క అద్భుతమైన ప్రతిభను వారి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు ముందే ప్రదర్శించడం మరియు పల్లె వాతావరణాన్ని, పల్లె ప్రాముఖ్యతను ఈతరం విద్యార్థులు ప్రత్యక్షంగా చూపించడం.
ఈ కార్యక్రమాన్ని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ డైరెక్టర్ బియ్యాల హరి చరణ్ రావు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతు యొక్క గొప్పతనం వివరించే విధంగా వేసిన నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేవిధంగా తల్లిదండ్రులకు తమ పిల్లలపై గల అమూల్యమైన ప్రేమ గురించి ప్రదర్శించిన నాటిక చూపరులను కంటతడి పెట్టించింది. పల్లె వాతావరణం ప్రకృతి అందాలను చూపించే విధంగా చేసిన నృత్యాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.
పలువురు విద్యార్థులు తమ గ్రామం లో ఉన్న ప్రముఖమైన ప్రదేశాలు, విశిష్టత గాంచిన దేవాలయాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సేవలు, తమ స్కూల్ యొక్క గొప్పతనం గురించి ఇచ్చిన ఉపన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు హరి చరణ్ రావు , శ్రీధర్ రావు , రజిత , అజిత , మౌనిక రావు మరియు తాటి పెళ్లి ఎంపిటిసి పూదరి శ్రీనివాస్,పోషకులు బక్కషెట్టి ఆంజనేయులు, శ్రీపాద ప్రశాంత్, అటకం రవి, ఆర్ఎంపీలు శ్రీపాద సత్యం , అబ్దుల్లా మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు మరియు తాటిపల్లి ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
