ట్యాంక్ బాండ్ పై  మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

అసెంబ్లీ ఆవరణలో విగ్రహం పెట్టేవరకు పోరాడుతాం - బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

On
ట్యాంక్ బాండ్ పై  మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

పట్టు సడలిస్తే సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లను అటకెక్కించే ప్రమాదం ఉంది 

అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయడంతోనే అంతా అయిపోలేదని. ఢిల్లీలో రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు యుద్ధం కొనసాగించాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో పోరాడాలి 

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌ ఏప్రిల్ 11:

మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కార్వాన్‌ చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె శుక్రవారం నివాళులర్పించారు.IMG-20250411-WA0038 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి, యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌, బీసీ సంఘాల ఐక్య పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న సర్కారు నిర్ణయం మంచిదేనని, అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ 48 గంటల పాటు నిరాహార దీక్ష చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించుకున్నామని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి సామాజిక న్యాయం కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న సంస్థ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని సాధించుకున్న స్ఫూర్తితోనే మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నామని అన్నారు. ''మేమెంతో మాకంత'' అనే నినాదంతో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి కొంత వరకు సాకారం చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది కదా అని మనం పట్టు సడలిస్తే సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లను అటకెక్కించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయడంతోనే అంతా అయిపోలేదని, ఢిల్లీలో రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు యుద్ధం కొనసాగించాల్సిందేనని అన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయన్న విషయం గుర్తించాలన్నారు.

అప్పటి వరకు రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సరిగా జరగలేదని అనేక ఫిర్యాదులు ఉన్నాయన్నారు. తమ కుటుంబాల వివరాలు సేకరించలేదని లక్షలాది మంది చెప్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసిన కుల సర్వే వివరాలు గ్రామాలు, వార్డుల వారీగా బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు మింట్‌ కాంపౌండ్‌ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేసి నివాళులర్పించారు.

*బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి*

రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌ లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎంబీ భవన్‌ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీతో ఆమె భేటీ అయ్యారు.  అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుకు మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని కోరుతున్నామని చెప్పారు. ఇదే డిమాండ్‌ తో తాము అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు.

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ ల అమలుతోనే రిజర్వేషన్ల అమలుకు ఉన్న 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందన్నారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం కష్టతరమేమి కాదన్నారు. ఈ బిల్లును కేంద్రం ఆమోదించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలన్నారు. వెంటనే ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

కవిత పోరాటానికి మద్దతు : జాన్‌ వెస్లీ

IMG-20250411-WA0028

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లదనేది తమ నమ్మకమని తెలిపారు. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన వివరాలను బహిర్గతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, యునైటెడ్ ఫులే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రాంచందర్, కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, యుపిఎఫ్ నాయకులు అలకుంటల హరి, కొట్టాల యాదగిరి,ఎత్తరి మారయ్య,  గోపు సదనందు, విజేందర్ సాగర్ ,రాచమల్ల బాలకృష్ణ , డి కుమారస్వామి, కోల శ్రీనివాస్,డి నరేష్ కుమార్, గురం శ్రవణ్, ఏల్చాల దత్తాత్రేయ, రామ్ కోటి, గొరిగే నర్సింహ , అశోక్ యాదవ్ ,లింగం శాలివాహన, పుష్ప చారి , మధు,విజయ్ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం..  కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ..  బిజెపి నాయకురాలు రాజేశ్వరి. సికింద్రాబాద్ ఏప్రిల్ 18 (ప్రజా మంటలు): మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని...
Read More...
State News 

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

  కొప్పుల పుస్తకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్ జలవిహార్ లో ఈ నెల 20, సా.5 గం.లకు హైదరాబాద్ ఏప్రిల్ 18: మాజీమంత్రి, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించించిన " కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం - ఒక  ప్రస్థానం" పుస్తకాన్ని BRS అధినేత కేసీఆర్, ఈనెల 20వ తేదీ...
Read More...
Local News 

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు.  రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు మండలంలో కొన్ని గ్రామాలకు కరెంటు బంద్    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మండలంలోని అన్ని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలులకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. రోడ్డు పొడవునా చెట్లు పడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎర్ధండి...
Read More...
Local News 

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం సీతాఫల్మండిలో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్ ఏప్రిల్ 18 ( ప్రజామంటలు) : దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి, అమిత్ షా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ  చెప్పాలని జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు సికింద్రాబాద్, ఏప్రిల్ 18 ( ప్రజామంటలు): సికింద్రాబాద్ లో శుక్రవారం క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.  కేజేఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్ధనలు చేశారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్,శైలా పాల్ లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో...
Read More...
Opinion 

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ. మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్  కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ...
Read More...
State News 

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

విడిసి చొరవతో... రాలిన పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...? గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి బుగ్గారం ఏప్రిల్ 18: గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత...
Read More...
Local News 

జై సూర్య ధన్వంతరి  ఆధ్వర్యంలో కుంకుమ పూజలు 

జై సూర్య ధన్వంతరి  ఆధ్వర్యంలో కుంకుమ పూజలు  గొల్లపల్లి ఎప్రిల్ 18 (ప్రజా మంటలు): శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం  యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం  మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమ ర్పం చారు కుంకుమ...
Read More...
Local News 

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది *సేవలో తరిస్తున్న వాసవి మహిళ సంఘం ఎంతో  గ్రేట్..    *విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ సరోజ వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): ఫ్యాషన్ వల్లే  మనం ఏదైనా సాధించ గలుగుతామని. అలాగే వాసవి మహిళా సంఘం నిర్వాహకులు  నిరుపేదల సేవలో చురుగ్గా పాల్గొంటు, తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ, డా.అంబేడ్కర్...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని చందోలి, బొంకూరు, వెనుగుమట్ల, లోత్తునూరు,వెంగళపూర్, శంకర్రావుపేట్ గ్రామాల్లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్  గురువారం రోజు ప్రారంభించారు.ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలలో రైతులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా  అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను...
Read More...
Local News 

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ    సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ( ప్రజామంటలు): అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో  ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్...
Read More...
Local News 

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు విజయం సాధించిన డా.సుభోద్, డా.రాజేశ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి యూనిట్ లో ఇటీవల ఖాళీ అయిన రెండు జనరల్ కౌన్సిల్ మెంబర్ (ఒకటి ప్రొఫెసర్ క్యాడర్, మరొకటి అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ) పోస్టులకు గురువారం గాంధీ ఆసుపత్రిలో ఎన్నికలు జరిగాయి. ఉదయం...
Read More...