చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి.. బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్..
జగిత్యాల /ధర్మపురి మార్చి 27(ప్రజా మంటలు)
జిల్లాలో చైర్మన్ కమిషన్ సభ్యుల పర్యటన..
సమాజంలో నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. చులకన భావంతో కులాలను పిలవడం వల్ల ఆ కులస్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బీసీ కమిషన్ రెండో రోజు పర్యటన లో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా లో కమిషన్ పర్యటించింధి
అనంతరం వారు నేరుగా తారక రామ నగర్ లో వీర ముష్టి కమ్యూనిటీ భవనం, గాంధీ నగర్ లో గల దొమ్మర సంఘ భవనం లో మరియు ధర్మపురి లో వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని బీసీ కమిషన్ చైర్మన్ సూచించారు.
అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ సమాజం లో ఇప్పటికీ కొన్ని కులాల పేర్లు చులకన భావంతో పిలిచేలాగా ఉన్నాయని, తిట్టు పదాలుగా వాడుతున్నారని ఆవేదన వ్యకం చేశారు. బీసీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని, కొన్ని పర్యాయపదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే తెలంగాణ బీసీ కమిషన్ అభ్యంతరాలు కోరిందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా లో పర్యటిస్తున్నామని తెలిపారు. కులాల పేర్ల మార్పులపై ఎవరికైనా అభ్యంత రాలున్నా, ఇతర పర్యాయపదాలు ఉన్నా తెలియజేయాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు.
కమిషన్ కి వచ్చిన అభ్యంతరాలు, సూచనల ఆధారంగా ఆయా కులాల పేర్ల మార్పుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ ఫలాలు బీసీ కులాల్లోని అందరికీ అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టి ఆమోదించిందని పేర్కొన్నారు. ఈ మేరకు వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ఇది భారతదేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. అనేక దశాబ్దాల నుంచి వెనుకబాటు గురైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని పేర్కొన్నారు. కులం పేరిట ఇబ్బంది పడుతున్న వారు ఆత్మ న్యూనతా భావానికి గురికావద్దని సూచించారు.
పిల్లలను చక్కగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలని, ఉన్నత స్థానాలు అధిరోహించేలా అన్ని రంగాల్లో వారిని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్ ఫలాలు పొందాలని సూచించారు. ఆయా కులాల పేర్ల మార్పు అంశం వచ్చే నెలలో పరిష్కరిస్తామని తెలిపారు. బీసీ కులాల్లోని అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించామని గుర్తు చేశారు. త్వరలో మిగతా జిల్లాల్లో పర్యటించి, ఆయా బీసీ కులాల స్థితిగతులను నేరుగా తెలుసు కుంటామని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన యువతీ యువకులు, రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వీర ముష్టి అంటే పూర్వ కాలంలో యుద్ధ వీరులు గా వుండే వారని కాలక్రమేణా ముష్టి అనే పదం అడుక్కునే పర్యాయ పదం గా మారిందని వీరముష్టి ప్రతినిదులు. తమ కులాన్ని వీర భద్రియ కులం గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కులం సర్టిఫికెట్లో తమ కులం పేరు ను గడ వంశీయులు గా మార్చాలని దొమ్మరి కుల సంఘం ప్రతినిధులు బిసి కమిషన్ చైర్మన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కులం పేరు దొమ్మరి ఉండడం వల్ల తాము సమాజంలో అనేక ఇబ్బందులు పడుతు న్నామని చులకన భావంతో చూస్తున్నారని వివరించారు. విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో తమ పిల్లలు అవమానానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. కులాలను అలా పిలవడం వల్ల ఎలాంటి ఆత్మ నూన్యత భావానికి గురీ కావద్దని చులకన భావంతో ఉండవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాల లక్ష్మి, బిసి సంక్షేమ జిల్లా అధికారి కల్పన, తహసిల్దార్ రామ్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
