ఐక్యంగా పోరాడి దక్షిణాది వాటా సంపాదించుకోవాలి - సిఎం రేవంత్ రెడ్డి

On
ఐక్యంగా పోరాడి దక్షిణాది వాటా సంపాదించుకోవాలి - సిఎం రేవంత్ రెడ్డి

చెన్నై మార్చ్ 22:

లోక్‌స‌భ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి తమ వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో త్వ‌ర‌లోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  చెన్నైలో నిర్వహించిన  Fair Delimitation (న్యాయమైన పునర్విభజన) జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే పునర్విభజనపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

✳️ పునర్విభజన అంశంలో సమావేశంలో అనేక కీలక అంశాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, దీనిపై ఐక్య కార్యాచరణ కోసం త్వరలో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. ద‌క్షిణ భార‌త‌దేశ పౌరుల గ‌ళాన్ని బ‌లంగా, ఐక్యంగా మొత్తం భార‌త దేశానికి వినిపిద్దామని పిలుపునిచ్చారు.

✳️ “నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నపై మ‌నంద‌రిని ఏక‌తాటిపై తెచ్చిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు. ఈ విష‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా.

✳️ 1971లో జ‌నాభా నియంత్రణ పాటించాలని దేశం నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి ద‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌లు చేశాయి. ఉత్త‌రాది పెద్ద రాష్ట్రాలు జ‌నాభా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యాయి. ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, వేగంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌, మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సుప‌రిపాల‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో మంచి ప్ర‌గ‌తి సాధించాయి.

✳️ కేంద్ర ఖ‌జానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ, తిరిగి త‌క్కువ మొత్తాన్ని పొందుతున్నాం. త‌మిళ‌నాడు ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే తిరిగి 29 పైస‌లే వెన‌క్కి వ‌స్తుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు 2.73 రూపాయలు వెన‌క్కి వెళుతున్నాయి. బీహార్‌ రూపాయి చెల్లిస్తే 6.06 రూపాయలు వెన‌క్కి వెళుతున్నాయి. క‌ర్ణాట‌క‌కు కేవ‌లం 14 పైస‌లు, తెలంగాణ‌కు 41 పైస‌లు, కేర‌ళ‌కు 62 పైస‌లు మాత్ర‌మే వెన‌క్కి వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో మ‌ధ్య ప్ర‌దేశ్ రూపాయి ప‌న్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.1.73 పైస‌లు వెళుతున్నాయి.

✳️ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయింపులు, ప‌న్ను చెల్లింపులు క్ర‌మంగా త‌గ్గిస్తోంది. చివ‌ర‌కు జాతీయ ఆరోగ్య మిష‌న్ కేటాయింపుల్లోనూ ఉత్త‌రాది రాష్ట్రాల‌కు 60 నుంచి 65 శాతం నిధులు ద‌క్కుతున్నాయి.

✳️ మ‌నది ఒకే దేశం. మ‌నం దానిని గౌర‌విస్తాం. కానీ ఈ నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను అంగీక‌రించం. ఎందుకంటే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను కుదించడమే. మంచి ప్ర‌గ‌తి సాధిస్తున్న రాష్ట్రాల‌ను ఈ ప్ర‌క్రియ ద్వారా శిక్షిస్తోంది. ఈ అస‌మ‌గ్ర‌మైన పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్ట‌కుండా అడ్డుకోవలసిన అవసరం ఉంది.

▶️ ముఖ్యంగా..

✳️ 1). సీట్లు పెంచొద్దు. ఉన్న సీట్ల‌తోనే పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఆ రకంగానే పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టారు. లేదంటే రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ అసమానతలు ఏర్పడేవి. 2001లో ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయి గారి నేతృత్వంలోని ప్ర‌భుత్వం పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను కూడా ఇదే రకంగా చేపట్టారు. లోక్‌స‌భ సీట్ల‌ను అదే సంఖ్య‌లో ఉంచుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గారు అదే విధంగా చేయ‌గ‌ల‌రా?

✳️ 2). జ‌నాభా దామాషా ప్రాతిప‌దికను పున‌ర్విభ‌జ‌న ద‌క్షిణాది వ్య‌తిరేకిస్తోంది. బీజేపీ ప్ర‌తిపాదిస్తున్న జ‌నాభా దామాషా ప‌ద్ద‌తిలో పున‌ర్విభ‌జ‌నను చేప‌డితే ద‌క్షిణాది రాష్ట్రాలు రాజ‌కీయ గ‌ళం కోల్పోతాయి. దక్షిణాది రాష్ట్రాలు ఉత్త‌రాదిలో ద్వితీయ శ్రేణి పౌరులుగా త‌గ్గించిబడుతుంది.

✳️ జ‌నాభా ప్రాతిపదిక‌న పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛత్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిప‌త్యం చ‌లాయిస్తాయ‌ని అందరూ అంగీకరిస్తున్నారు. ఏ ప‌రిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనను అంగీక‌రించ‌కూడ‌దు.

✳️ 3) ప్రొరేటా విధానాన్నీ అంగీక‌రించ‌లేం. ప్రొరేటా విధానం కూడా ద‌క్షిణాదికి న‌ష్ట‌మే క‌లగజేస్తుంది. ప్రొరేటా ప్ర‌క్రియ కూడా రాజ‌కీయ అంత‌రాల‌ను పెంచుతుంది. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మ‌ధ్య తేడా కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటును నిర్ణ‌యిస్తుంది. ఒక్క సీటు కూడా కేంద్రంలో ప్రభుత్వాలను నిర్ధేశించగలదు. దేశంలో ఒక్క సీటుతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌డిపోయిన చ‌రిత్ర మ‌న అనుభవంలో ఉంది.


▶️ ఆమోదయోగ్య ప్రతిపాదనలు

✳️ మ‌రో 25 ఏళ్ల‌పాటు లోక్‌స‌భ సీట్ల‌లో ఎటువంటి మార్పు తీసుకురావ‌ద్దు. సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టాలి. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేయాలి. రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలి.

✳️ రాష్ట్రాల్లోని న‌గ‌రాలు, గ్రామాల్లోని జ‌నాభా ఆధారంగా లోక్‌స‌భ సీట్ల హ‌ద్దుల‌ను మార్పు చేయాలి. తాజా జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలి. ప్ర‌తి రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి. లోక్ స‌భ స్థానాల పెంపును మ‌రో 25 ఏళ్ల‌పాటు వాయిదా వేయాలి.

✳️ జ‌నాభా నియంత్ర‌ణ‌లో ప్రగతి సాధించిన ద‌క్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వ‌స్తి చెప్పాలి. జ‌నాభా దామాషా ప్రాతిపదిక‌న పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టొద్ద‌ని ద‌క్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి దేశంలోని ఇత‌ర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లే ద‌క్షిణాదికి అవ‌కాశం ఇవ్వాలి.

✳️ మంచి ప్ర‌గ‌తి సాధించిన ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పార్ల‌మెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వ‌డం ద్వారా ఇత‌ర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుప‌రిపాల‌న‌పై దృష్టి సారించేలా చేయాలి.

▶️ ప్రధాన డిమాండ్లు 

✳️  543 సీట్లు ఉన్న లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం ద‌క్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130. ఇది మొత్తం సీట్ల‌లో 24 శాతం. పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డే నూత‌న లోక్‌స‌భ‌లో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు ఇవ్వాలి.

✳️ దేశవ్యాప్తంగా 50 శాతం సీట్ల‌ను పెంచాల‌నుకుంటే అలా పెరిగే 272 సీట్ల‌తో మొత్తం లోక్‌స‌భ‌ సీట్ల సంఖ్య 815 అవుతుంది. ఇందులో 33 శాతం అంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌ లోక్‌స‌భ‌ సీట్లు 272 గా ఉండాలి. ఈ సీట్ల‌ను ద‌క్షిణాదిలోని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరిల‌కు ఇప్పుడున్న‌ ప్రొరేటా ప్రాతిప‌దిక‌న పంచ‌వ‌చ్చు.

✳️ దేశంలో మిగిలిన సీట్ల‌ను ఉత్త‌రాది, ఇత‌ర రాష్ట్రాల‌కు కేంద్రం పంచ‌వ‌చ్చు. అనుకున్న దానికంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సీట్ల సంఖ్య త‌గ్గిస్తే అది దేశ రాజ‌కీయ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరించారు.

Tags

More News...

State News 

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 30 మార్చి (ప్రజా మంటలు) :  నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం మరియు శక్తిపీఠం గణపతి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి...
Read More...
Local News 

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

 కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి ఢిల్లీ మార్చి 30(ప్రజా మంటలు)  తిమ్మంచర్ల గుంతకల్ ఎఫ్సిఐ గోడెన్ లో చాలా కాలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యపు ధాన్య నిలువల్ని తరలించి గోడన్ నీ ఖాళీ చేసి, మునుపటిలాగా రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్సీఐ గోడన్లని వాడుకునే విధంగా అనుమతి ఇప్పించగలరని కేంద్ర ఆహార భద్రత వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషి...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో  పంచాంగ శ్రవణం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో    పంచాంగ శ్రవణం     గొల్లపల్లి మార్చి 30( ప్రజా మంటలు):    ఉగాది పండుగ పురస్కరించుకొని , జాగీతయాలలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో చిలుక ముక్కు నాగరాజు శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.     ఉదయం సత్సంగము అనంతరము, స్వామి సూర్య నారాయణ పల్లకి సేవ తదనంతరము ఉగాది పచ్చడి వితరణ  తరువాత దేవాలయము మహిళా కమిటి సభ్యులు మాత మణుల...
Read More...
Local News 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక 

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక     జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)వెలమ సంక్షేమ మండలి ఆద్వర్యం లో శ్రీ *విశ్వావసు నామ ఉగాది పంచాంగ శ్రవణం* ఆదివారం   సంఘం భవనంలో నిర్వహించారు. కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా సంజయ్ కుమార్  రాధిక .ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా సభ్యులు రామచందర్ రావు, సంఘం అధ్యక్షులు అయిల్నేని...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                             

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు                                  ఘనంగా స్వామివారి రథోత్సవం,    -స్వామి వారికి రథం ను బహుకరించిన మామిడి చిన్నయ్య పటేల్ వారసులు,      ఇబ్రహీంపట్నం మార్చి 30(ప్రజా మంటలు దగ్గుల అశోక్జ):    గిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఉగాది జాతర ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...
Spiritual   State News 

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం - గాయత్రి సత్రంలో పండిత సన్మానం     (రామ కిష్టయ్య సంగన భట్ల...     9440595494)    ఉగాది పర్వ దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి చెందిన లబ్ద ప్రతిష్టులైన పండితులు సన్మానాలు సత్కారాలు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా...
Read More...
Local News 

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్, ఇబ్రహీంపట్నం  మార్చి 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ),జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలోని పురాతనాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎంపీ నిధులు రూపాయలు 1,50,000 తో ఏర్పాటుచేసిన హైమస్ లైట్ లను ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షుడు బాయిల్ లింగారెడ్డి ఆదివారం ప్రారంభించారు. కేంద్ర నిధులతోనే...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.       జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)  పట్టణములోని సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ సంబరాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విద్యతోపాటు భారత దేశ  సంస్కృతి సాంప్రదాయాలను సైతం బోధించడం అభినందనీయం అని...
Read More...
Local News 

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం 

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక మరియు నంబి వాసుదేవాచార్య కౌశిక  ద్వ జారోహణం గావించి, ఉగాది ప్రాశ స్త్యాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్...
Read More...
Local News 

ప్రశాంతంగా రంజాన్​ వేడుకలు   * ఈస్ట్​ జోన్​ డీసీపీ బాలస్వామి

ప్రశాంతంగా రంజాన్​ వేడుకలు   * ఈస్ట్​ జోన్​ డీసీపీ బాలస్వామి సికింద్రాబాద్​, మార్చి 29 ( ప్రజామంటలు ):    గత 28 రోజులుగా సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పవిత్ర రంజాన్​ మాస ఈవెంట్లు జరిగాయని, ఇందులో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని పలువురు ముస్టిం కమ్యూనిటీ పెద్దలు ప్రశంసించారు. శనివారం సాయంత్రం వారాసిగూడ జడ్​ఎం బాంకెట్​ హాల్​ లో ఇమామ్స్​, మౌజన్స్, ముస్టిం...
Read More...
Local News 

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లాలో నీ కలెక్టరేట్ స్టేట్ చాంబర్లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్   జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు    జిల్లా కలెక్టరేట్ స్టేట్ చాంబర్లోజగిత్యాల...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల మార్చి 29(ప్రజా మంటలు)  పట్టణములోని దేవి శ్రీ గార్డెన్స్ లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని,ప్రార్థనలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  కుల మత తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి...
Read More...