విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకే విద్యుత్ కన్జ్యూమర్ ఫోరం.
.
ఎరుకల నారాయణ సి.జి.ఆర్.ఎఫ్ ll, చైర్పర్సన్ టి.జీ. ఎన్పీడీసీఎల్.
జగిత్యాల మార్చి 22 ( ప్రజా మంటలు )
పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక శనివారం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎరుకల నారాయణ సి.జి. ఆర్.ఎఫ్ ll, చైర్మెన్ టిజి. ఎన్పీడీసీఎల్. పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ వినియోదారుల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రతి ఒక్కరు కూడా మోటార్లకు కెపాసిటర్ను అమర్చుకోవాలని దాని వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని, రైతులకు ఏదైనా విద్యుత్ సమస్యలు గాని ఉంటే వెంటనే విద్యుత్ కన్జ్యూమర్ ఫోరం కు తెలియజేస్తే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవాలోపం ఉన్న ఫోరమునకు ఫిర్యాదు చేయవచ్చునని. మీ ఫిర్యాదును వ్రాత పూర్వకముగా సర్వీసు కనెక్షన్ నెంబర్ మరియు మీ యొక్క పూర్తి చిరునామాతో పోస్టు ద్వారా గాని, మెయిల్ ద్వారా గాని, వ్యక్తిగతంగా గాని, "వాట్సాప్" కు గాని, పై ఆఫీసుకు పంపాలని. ఫిర్యాదు చేయడానికై ఎలాంటి రుసుములు చెల్లించనక్కరలేదని. ఫిర్యాదు చేయుటకు వకీలు (అడ్వకేటు)ను కూడా పెట్టవలసిన అవసరము లేదని అన్నారు. ఫిర్యాదుదారుల నుంచి మరింత వివరములు తెలుసుకొనుటకు అవసరమైన యెడల ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
ఈనాటి కార్యక్రమంలో ఫోరం సభ్యులు సలంద్ర రామకృష్ణ, లకావత్ కిషన్, మర్రిపల్లి రాజ గౌడ్, జగిత్యాల ఎస్సీ. సలియా నాయక్, ఎడీఈ. జవహర్ లాల్ నాయక్, ఏఈలు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
