ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

On
ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

వైభవంగా ధర్మపురి యోగానందుని తెప్పోత్సవం

  (రామ కిష్టయ్య సంగన భట్ల
     9440595494)

  ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలలో భాగంగా శుక్ర వారం సాయంత్రం నుండి రాత్రి వరకు బ్రహ్మ పుష్కరిణిలో నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఏటా సాయంత్రం నిర్వహించే స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, దేవస్థానం ఏసీ, ఈఓ సంకటాల శ్రీనివాస్ ఆద్వర్యంలో,  దేవస్థాన ట్రస్టు బోర్డు అధ్యక్షుడు జక్కు రవీందర్, 
సభ్యుల పర్యవేక్షణలో,  యాజ్ఞికులు పురుషోత్తమా చార్య, వేద పండితులు రమేశ్ శర్మ, ఉప ప్రధానా ర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్య, నంబి శ్రీనివాసా చార్యులు, వంశీ, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష్మీ నారసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంట లకు శ్రీయోగానంద నారసింహ ప్రధానా ఆలయం నుండి వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో భక్తజనం తోడురాగా, నారసింహుని ఉత్సవ మూర్తులను బ్రహ్మ పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా కొని తెచ్చారు. అనంతరం ప్రత్యేక నూతన బహూకృత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించగా భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచిన భక్తులు పూజా ద్రవ్యాలు సమర్పించి కైమోడ్పులిడి తన్మయులైనారు. 

తరువాత బ్రహ్మపుష్కరిణి మధ్య వేదికపై గల భోగ మంటపములో గల ఊయలలో స్వామిని ఆసీనుల జేసి డోలోత్సవాన్ని జరపగా భక్తులు జయజయ ధ్వనాలతో ప్రార్ధించారు. ఉత్తర ద్వారంగుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా, ఇరుకైన మార్గం గుండా లోనికి వెళ్ళి కట్న కానుకలను సమర్పించి దర్శనాలు చేసుకున్నారు. రాత్రి 9గంటల వరకూ కార్యక్రమం కొనసాగింది.IMG-20250314-WA0008 

అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిన సందర్భంగా జగిత్యాల డీ ఎస్పీ రఘు చందర్ మార్గదర్శకత్వంలో, ధర్మపురి సీ ఐ రాం నారాయణ రెడ్డి పర్యవేక్షణలో, పలువురు సబ్ ఇన్స్ పెక్టర్లు, డివిజన్ లోని పెద్ద  మొత్తంలో ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డులతో పాటు సెక్షన్ల ప్రత్యేక ఆర్మ్డ్ పోర్స్ తో ఎలాంటి అవాంఛనీయాలు చోటుచేసు కోకుండా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి మెట్టుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చ్ 14 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్): మానసిక పరిపక్వత బావోద్వేగ స్థిరత్వం క్రీడల వల్లే సాధ్యం అవుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి అన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ముత్తయ్య రెడ్డి, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు చదువులో మానసిక...
Read More...
Local News  State News 

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం వైభవంగా ధర్మపురి యోగానందుని తెప్పోత్సవం    (రామ కిష్టయ్య సంగన భట్ల          9440595494)    ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలలో భాగంగా శుక్ర వారం సాయంత్రం నుండి రాత్రి వరకు బ్రహ్మ పుష్కరిణిలో నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఏటా సాయంత్రం నిర్వహించే స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవాలసభ్యుల...
Read More...
Local News  State News 

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం   (రామ కిష్టయ్య సంగన భట్ల)   ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, శుక్ర వారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, అపర వైకుంఠపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్టేతర ప్రాంతాల నుండి జానపదుల బృంద గానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వనాలు, మంగళ వాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై  బ్రహ్మోత్సవ...
Read More...
Local News 

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత    రాయికల్  మార్చి 14 ( ప్రజా మంటలు) వీరితో పాటు బి.ఆర్.యస్ పార్టీ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, మండల , పట్టణ కో- ఆర్డీనేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ  ఏ ఎం సి ఛైర్మన్ మారంపెల్లి రాణి సాయికుమార్ ,మాజీ ఏ ఎం సి వైస్ ఛైర్మన్ కొల్లూరి వేణు, మాజీ సర్పంచ్...
Read More...
Local News 

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల మార్చి 14(   ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ * జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు      జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.  పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా,...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)    అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి   సమయంలో  జగిత్యాల టౌన్ కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్ లలో ని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.      అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)   శుక్రవారం హోళి శుభ సంధర్భంగా ధన్వంతరి ఆలయములో  మాతా ధనలక్ష్మి సేవలో కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది..   కుంకుమ పూజలో 40 మంది మాతలతో అలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు అధ్వర్యములో అంగరంగ వైభవంగా జరిగింది.  హోలీ పండుగ  సంధర్భంగా మాజి జిల్లా పరిషత్ చైర్మన్...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం జగిత్యాల13మార్చి (ప్రజా మంటలు)తెలంగాణ ఆడబిడ్డల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ రుద్రమదేవి, తెలంగాణ జాగృతి అధినేత్రి,నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కయ్య   జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ధరూర్ క్యాంపులో గల కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి కేక్...
Read More...
Local News 

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి   * హోలీ సెలబ్రేషన్స్​ లో ఈ జాగ్రత్తలు పాటించండి..  * గాంధీ ఆర్​ఎంవో డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) :   నేడు రంగుల పండుగ హోళీ..చిన్న, పెద్ద అంతా ఎంతో హుషారుగా, సంతోషంగా జరుపుకునే రంగుల కేళీ ఇది. అయితే ఇటీవల కాలంలో సహజసిద్దమైన రంగులకు బదులు హానికరమైన రసాయనలతో రసాయన...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి.. దాని తర్వాతే ఉద్యోగ నియమకాలు చేపట్టండి.. సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం బన్సీలాల్​ పేట లో ఎమ్మార్పీఎస్​ సీనియర్​ నాయకులు మాచర్ల ప్రభాకర్​ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. గ్రూప్​ 1, 2, 3, 4 , ఎక్స్​ టెన్షన్​...
Read More...
Local News 

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,  

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,   ఇబ్రహీంపట్నం మార్చి 13 (ప్రజామంటలు దగ్గుల అశోక్):   మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలో బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొద్దిగా దూరంలో  తోటలోనికి వెళ్లే 11 కెవి కరెంటు గల వాయర్లు, వాయిర్ల  మధ్యలో జంపర్ వైర్లు  వేసి వేరే ట్రాన్స్ఫార్మర్ కు కరెంటు ఇవ్వడంతో ఆ జంపర్ల మధ్య
Read More...