విద్యుత్ లైన్ మన్ ల సేవలు ప్రశంసనీయం ఎస్ఈ షాలియా నాయక్
మెట్పల్లి మార్చి 4(ప్రజా మంటలు)
ఘనంగా లైన్ మన్ దివస్ వేడుకలు
వినియోగదారుల సేవలో నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో లైన్మెన్ ల పాత్ర ప్రశంసనీయమని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శాలిని నాయక్ పేర్కొన్నారు.
లైన్ మన్ దివస్ సందర్భంగా మెట్టుపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ పురోభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కొరకు క్షేత్రస్థాయిలో లైన్మెన్ లు అహోరాత్రులు శ్రమించి మంచి సేవలు అందిస్తున్నారని సిబ్బందిని కొనియాడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ లైన్మెన్లు పనికి ఉపక్రమించేటప్పుడు ముందస్తు రక్షణ చర్యలు గైకొనాలని, ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. తద్వారా తనతోపాటు ఇతరులను కూడా ప్రమాదాల బారి నుండి రక్షించవచ్చని పేర్కొన్నారు.
డీఈ గంగారాం మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో ఇంటర్మీడియట్ పరీక్షలు, రంజాన్ తదితర ముఖ్యమైన సందర్భాల్లో అంతరయాలు లేని సరఫరా అందించుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం, పరిశ్రమల కొరకు వేలాది కోట్ల విదేశీ పెట్టుబడులకు విద్యుత్ రంగంలో అద్భుతమైన మౌలిక వసతులు కారణమని అందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అవిశ్రాంత కృషి కారణమని ఏడిఈ మనోహర్ తెలిపారు.
కార్యక్రమ ప్రారంభానికి ముందు గతంలో విధుల్లో ఉండి అశువులు బాసిన లైన్మెన్ లకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సేవలో అత్యుత్తమ ప్రతిభ సిబ్బందికి ఎస్ఈ శాలియా నాయక్ మరియు డిఇ గంగారం లు ప్రశంసా పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఈ లు రవి, అజయ్, సబ్ ఇంజనీర్లు రమేష్, అభినయ్, స్రవంతి వివిధ మండలాల క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
