క్యాన్సర్ బాధితుడికి 1.63 లక్షల విరాళాలు.
క్యాన్సర్ బాధితుడికి 1.63 లక్షల విరాళాలు.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 28:
క్యాన్సర్ వ్యాధి సోకిన ఓ బాధితుడికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.63 లక్షలు విరాళాలు అందించి అండగా నిలిచి తమ ఔదార్యం చాటారు.
ధర్మపురి మండల కేంద్రానికి చెందిన నరెందుల దామోదర్ ఓ కూరగాయల షాపులో పనిచేస్తూ , పేదరికంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
క్యాన్సర్ వ్యాధి సోకడంతో కుటుంబం ఖర్చులతో పాటు వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
వీరి దీన స్థితిని తెలుసుకున్న ధర్మపురి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ ఫిబ్రవరి 3 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు. దాతలు స్పందించి దామోదర్ భార్య గంగాభవాని బ్యాంకు ఖాతాకు రూ. 1.63 లక్షలు విరాళాలు పంపించగా వాటి నుండి తక్షణ వైద్య ఖర్చులకు రూ. 50 వేలను స్థానిక సీఐ రాం నర్సింహరెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి పంపిణీ చేయించారు. మిగతా విరాళాలను భవిష్యత్ వైద్య ఖర్చులకు తన భార్య సేవింగ్ ఖాతాలో నిల్వ ఉంచారు. ఈ సందర్భంగా రమేష్ తో పాటు సాయం అందించిన దాతలను సిఐ అభినందించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆశిష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
