రైస్ మిల్లర్ల కి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించాలి - మిల్లర్ల విజ్ఞప్తి

On
రైస్ మిల్లర్ల కి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించాలి - మిల్లర్ల విజ్ఞప్తి

రైస్ మిల్లర్ల కి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించాలి - మిల్లర్ల విజ్ఞప్తి

జగిత్యాల అక్టోబర్ 03:

రైస్ మిల్లర్ల సమస్యలపై జగిత్యాల జిల్లా బాయిల్డ్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న వడ్లకు 500 బోనస్ మరియు ప్రజలకు సన్న బియ్యం పంపిణీ అభినందనీయం అన్నారు, 2024-25 ఖరీఫ్ సీజన్లో సీఎంఆర్ ధాన్యం సేకరణ విషయంలో మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్న బియ్యం పంపిణీ విషయం లో రైస్ మిల్లర్ల కి ఎదురయ్యే సమస్యలు వాటి త్వరిత గతిన పరిష్కారం గురించి ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేశారు., సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ,ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవీన్ రావు, పెండ్యాల చెన్న కేశవ్,శ్రీనివాస్ రావు, మధు,సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags