ఘనంగా కొనసాగుతున్న శ్రీ దేవి వైభవం ప్రవచనం.

On
ఘనంగా కొనసాగుతున్న శ్రీ దేవి వైభవం ప్రవచనం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు) : 

శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో, ప్రముఖ పౌరాణిక వేద పండితులు, పురాణ బ్రహ్మా బిరుదాంకితులు , సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ళ విషు శర్మ చే జరుగుతున్న దేవీ వైభవం ప్రవచనం ఆదివారం 3 వ రోజు కు చెరింది.

ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ జ్యోతీ, లక్ష్మన్ ఈ కార్యక్రమంలో పాల్గొని , ప్రత్యేక పూజలు జరిపి, అమ్మవారికి టెంకాయ కొట్టి, దేవీ వైభవం ప్రవచన కార్య క్రమం శ్రద్ధగా విన్నారు.

ఆలయ అర్చకులు వేనయ్య, భక్త మార్కడేయ ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ టెంకాయ సమర్పించారు.

ఈ నాటి ప్రవచనం లో త్రిమూర్తులకు దేవీ దర్శనం, త్రిమూర్తుల స్తుతి, దేవి తత్వోపదేశం, ద్రువ సంది చరిత్ర, ఘట్టాలను విషు శర్మ కళ్లకు కట్టినట్టు చెబుతుంటే, శ్రోతలు తన్మయత్వం తో, ప్రవచనాలు విన్నారు.

ఈ నాటి కార్యక్రమంలో ఆలయ అద్యక్షులు డా. సతీష్ కుమార్, నిర్వహకులు మార లక్ష్మీ నారాయణ, మార రాజేశం,మార కైలాసం,సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, మాతలు, భక్తులు ,తదితరులు పాల్గొన్నారు.

Tags