పార్టీ నిర్ణయం శిరసావహిస్తా!  పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో భోగ శ్రావణి?

On
పార్టీ నిర్ణయం శిరసావహిస్తా!  పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో భోగ శ్రావణి?

పార్టీ నిర్ణయం శిరసావహిస్తా!
 పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో భోగ శ్రావణి?

జగిత్యాల సెప్టెంబర్ 26:
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల మాజీ  మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి బిజెపి అభ్యర్థిగా బరిలో ఉంటుందని చర్చలు జర్గుతున్నాయి.

పార్టీ అధిష్టానం వద్ద బోగ శ్రావణి పేరుపై పట్టభద్రుల నియోజకవర్గ స్థాయిలో సర్వేలు కొనసాగుతున్నట్టు చర్చలు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో బోగ శ్రావణిని *ప్రజా మంటలు ప్రతినిధి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారా? ప్రజల్లో చర్చలు మొదలయ్యాయని శ్రావణి ని ప్రశ్నించగా తాము ఏమి అనుకోవడం లేదని, కాకపోతే పార్టీ అవకాశం ఇస్తే, పార్టీ ఆదేశాన్ని శిరసావహిస్తామని తెలిపారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన, విద్యావంతురా లైన మహిళగా, మరియు మంచి వాగ్దాటి కలిగిన భోగ శ్రావణి బరిలో ఉంటే ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఎక్కడికక్కడ చర్చలు కొనసాగుతున్నాయి. బిజెపి అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తుందో చూడాల్సిందే.

Tags