స్కూల్ గేమ్స్ క్రీడల్లో విజేతలకు మున్సిపల్ చైర్ పర్సన్ చే బహుమతుల వితరణ.

- రెండో రోజు జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు.

On
స్కూల్ గేమ్స్ క్రీడల్లో విజేతలకు మున్సిపల్ చైర్ పర్సన్ చే బహుమతుల వితరణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు) : 

జిల్లాస్థాయి పాఠశాలల క్రీడల్లో భాగంగా ఈ రోజు అండర్ 17బాలుర కబడ్డీ,ఖోఖో, వాలీ బాల్ క్రీడలు నిర్వహించినట్లు జిల్లా విద్యాధికారి బి. జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

బుధవారం రోజు జరిగిన క్రీడల్లో విజేతలు : 

  1. వాలీబాల్ లో ప్రథమం గా వెల్గటూర్, ద్వితీయ సారంగాపూర్,
  2. ఖో ఖో లొ ప్రథమ కోరుట్ల, ద్వితీయ మేడిపల్లి,
  3. కబడ్డీ లొ ప్రథమ కోరుట్ల, ద్వితీయ జగిత్యాల అర్బన్ లు బహుమతులు సాధించాయి.

ఇదిలా ఉండగా బుధవారం నిర్వహించిన పోటీలలో విజేతలకు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడబాల జ్యోతి బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు.

కాగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలలో పాల్గొనే క్రీడాకారులకు బోజన సదుపాయం కార్యక్రమం లో పాల్గొని క్రీడాకారులకు భోజనం ను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్, పట్టణ పిఈటి లు తదితరులు స్వయంగా వడ్డించారు.

Tags