సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్, గల్ఫ్ జెఏసి నాయకుల

On
సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్, గల్ఫ్ జెఏసి నాయకుల

సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్, గల్ఫ్ జెఏసి నాయకుల

హైదరాబాద్ సెప్టెంబర్ 21:

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోను ఇటీవల విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్, గల్ఫ్ జెఏసి బృందం నాయకులు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లో శుక్రవారంనాడు రాత్రి సెక్రటేరియట్ లో రాష్ట్ర మంత్రి పోన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి, లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శేర్ నర్సారెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికులకు 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం అభినందనీయమనీ, గల్ఫ్ కార్మికుల కష్టనష్టాలను అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడం, గల్ఫ్ కార్మికుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రవాసి ప్రజావాణిని ఏర్పాటు చేయడం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వడం వంటి అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బి.ఎం. వినోద్ కుమార్, రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జెఏసి ప్రతినిధి బృందం నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, గుగ్గిళ్ళ రవి గౌడ్, తోట ధర్మేందర్, మచ్చ మల్లికార్జున్, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, దువ్వాస రామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.

Tags