బతుకమ్మ చీరలకు బదులు రూ.500ల నగదు ?
బతుకమ్మ చీరలకు బదులు రూ.500ల నగదు ?
ఈ సారి మహిళలకు బతుకమ్మ చీరలకు బదులుగా,వాటి స్థానంలో ఒక్కొక్కరికి కానుకగా రూ. 500 నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా ప్రభుత్వం తరఫున అందించే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
చీరల్లో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి, సర్కార్ ఈ సారి బతుకమ్మ పండగకు బతుకమ్మ చీరలు కాకుండా కొత్త కానుక ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా రూ. 500 నగదు ఇవ్వాలని సంబంధిత వివరాలు కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం.
బతుకమ్మ పండగ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్ప టికీ నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.
గత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు బదులుగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 500 నగదు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
రూ. 500 లేదంటే ఆపైనా అందించేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవ డిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్