యూట్యూబ్ హర్షసాయి పై అత్యాచారం కేసు
యూట్యూబ్ హర్షసాయి పై అత్యాచారం కేసు
హైదరాబాద్ సెప్టెంబర్ 25 :
ప్రేమ పేరుతో మోసం చేసారని యువతి ఫిర్యాదుతో యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
యువతిపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది..
సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది.
బాధిత యువతి ఒక రియాల్టీ షోలో పాల్గొంది. ఆ తర్వాత ప్రైవేటు పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని హర్షసాయి చెప్పినట్లు,ప్రేమ పేరుతో అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.
పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదు పేర్కొంది.బాధిత యువతికి కొండాపూర్లోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు పూర్తి చేశారు.
హర్షసాయి తండ్రిపైనా బాధిత యువతి ఫిర్యాదు చేసినది.హర్షసాయి హీరోగా, బాధిత యువతి హీరోయిన్గా గతంలో ఒక సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే..
బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు 328, 376 (2) 354 , 376n కింద కేసులు నమోదు చేశారు ఇప్పటికే బాధిత యువతి స్టేట్మెంట్ ను రికార్డు చేసిన నార్సింగి పోలీసులు..
కేసునమోదు అయినప్పటి నుండి ఉన్న యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉన్నాడు.అందుబాటులో లేని హర్షసాయి తండ్రి రాధాకృష్ణ..
తండ్రి రాధాకృష్ణ, కొడుకు హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.