నిరాశ్రయులు, అనాథలకు 257వ అన్నదాన కార్యక్రమము
On
నిరాశ్రయులు, అనాథలకు 257వ అన్నదాన కార్యక్రమము
సికింద్రబాద్ జులై 28 :
వాహనంలో సంచరిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఫుట్పాతుల మీద జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారిని గుర్తించి స్కై ఫౌండేషన్ వారు ఉచితంగా ఆహారాన్ని అందించారు. వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వివిధ రోగాల బారిన పడుతున్నారు. ఈ అభాగ్యుల జీవితాలపట్ల ప్రభుత్వం బాధ్యతను తీసుకోని మొబైల్ వైద్యశాలను ఏర్పాటు చేసి క్రమంతప్పకుండా వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 257వ అన్నదాన కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సేవ సభ్యులు అఖిల్, హరీష్ కుమార్, శుభం, అమృత్, సాయిరాం మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.
Tags