మిత్రమా !! మత్తు వద్దు మస్తుగా జీవించడం ముద్దు - భోగోజీ ముకేష్ ఖన్నా, పట్టణ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు.

On
మిత్రమా !!  మత్తు వద్దు మస్తుగా జీవించడం ముద్దు - భోగోజీ ముకేష్ ఖన్నా, పట్టణ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు.

సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113. 

జగిత్యాల 21 జూలై (ప్రజా మంటలు). 

శనివారం జగిత్యాల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బోగోజీ. ముకేశ్ ఖన్నా ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ సొసైటీ అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎం ఎల్ సి . జీవన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ....  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థల, మాధకద్రవ్యాల పట్ల కఠినం గా వ్యవహారిస్తుందని,ఎంతటి వారినైనా ఈ వ్యవహారం లో పట్టు పడితే ఉపేక్షిoచడం జరగదని,విద్యార్థులు, యువత మత్తు పధార్థలకు దూరంగా ఉండాలని, మంచిగా చదువుకోని తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని, తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ పేరిట నిరుద్యోగ యువత కు అండగా ఉండే విధంగా కార్యక్రమం రూపోందిస్తుందని యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల. జ్యోతి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి. నాగ భూషణం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. విజయలక్ష్మి-దేవేందేర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డ్రగ్ ఫ్రీ సొసైటీ పేరిట పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.

Tags