ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న కొత్త ఎస్పీ అశోక్ కుమార్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ధర్మపురి జూన్ 18 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కు నూతనముగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితులైన అశోక్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికిన పిదప వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ శ్రీ స్వామివారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది.
కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ,ముత్యాల శర్మ, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు అశ్విన్ కుమార్ , వంశీకృష్ణ , స్థానిక సిఐ , ధర్మపురి, బుగ్గారం ఎస్సై లు పాల్గొన్నారు.
Tags